Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘లక్ష్మీ బాంబ్’ వివాదం ముగిసింది: నిర్ణయం మార్చుకున్న రాఘవ లారెన్స్!
సౌత్లో సూపర్ హిట్ అయిన 'కాంచన' హిందీలో 'లక్ష్మీ బాంబ్' పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రాఘవ లారెన్స్ బాలవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇటీవల కొంత షూటింగ్ పూర్తయ్యాక ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఫస్ట్ లుక్ పోస్టర్ తనకు తెలియకుండా రిలీజ్ చేశారని, నిర్మాతలు తనకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని, గౌరవం లేని చోట తాను పని చేయలేను అంటూ ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు లారెన్స్. వారం తర్వాత లారెన్స్ మరో ట్వీట్ చేస్తూ నా అభిమానులతో పాటు అక్షయ్ కుమార్ అభిమానుల నుంచి చాలా రిక్వెస్టులు వస్తున్నాయని, తిరిగి 'లక్ష్మీ బాంబ్' దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారని, నిర్మాతలతో చర్చల తర్వాత ఈ విషయంలో ఒక నిర్ణయానికి వస్తానని తెలిపారు.
వృద్ధురాలికి ఇల్లు కట్టించి మాట నిలబెట్టుకున్న రాఘవ లారెన్స్
నిర్మాతలతో చర్చల అనంతరం రాఘవ లారెన్స్ ఎట్టకేలకు తన నిర్ణయం మార్చుకున్నారు. తిరిగి దర్వకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం సాయంత్ర ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. తన ఫీలింగ్స్ అర్థం చేసుకుని సమస్య పరిష్కారానికి తోడ్పడిన హీరో అక్షయ్ కుమార్, నిర్మాత షబినా ఖాన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. ఇక లక్ష్మీ బాంబ్ షూటింగ్ చకచకా సాగుతుందని తెలిపారు.
Hi Dear Friends and Fans...!
— Raghava Lawrence (@offl_Lawrence) June 1, 2019
As you wished I would like to let you know that I am back on board as a director of #LaxmmiBomb with @akshaykumar pic.twitter.com/9HRHF5y2VV
తెలుగు, తమిళంలో రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'కాంచన' సూపర్ హిట్ కావడంతో దీన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ, తుషార్ కపూర్, ఆర్ మాధవన్, శోభిత ధూళిపాళ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2020 జూన్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. సబినా ఖాన్, తుషార్ కపూర్ కేప్ ఆఫ్ గాడ్ ఫిల్మ్స్, తుషార్ ఎంటర్టెన్మెంట్ హౌస్ బేనర్లో నిర్మిస్తున్నారు.