Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లోక్సభ ఫలితాలు 2019: సన్నీ లియోన్ పేరు మారుమ్రోగిపోతోంది!
దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా లోకసభ ఎన్నికల రిజల్ట్స్ హడావుడే కనిపిస్తోంది. ఇండియాలోని న్యూస్ ఛానల్స్ ఫలితాల సరళిని ఎప్పటికప్పుడు వీక్షకులకు అందించే పనిలో తలమునకలై ఉన్నాయి. కేంద్రంలో అధికారం దిశగా భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ క్లీన్ స్వీప్ ఖాయమని తేలిపోయింది.
అయితే ఫలితాల వేళ... పాలిటిక్స్తో సంబంధంలేని బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరు మారుమ్రోగి పోతుండటం చర్చనీయాంశం అయింది. అందు కారణం ప్రముఖ జర్నలిస్ట్, రిప్లబిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి టంగ్ స్లిప్ అవ్వడమే. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతోంది.
గెలుపు దిశగా సన్నీ లియోన్ అంటూ...
రిపబ్లిక్ టీవీలో లైవ్ షో నిర్వహిస్తున్న అర్నాబ్ గోస్వామి... గురుదాస్పూర్ నియోజకవర్గం నుంచి సన్నీ లియోన్ గెలుపు దిశగా అడుగులు వేస్తోంది అంటూ వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఇక్కడి నుంచి పోటీ చేస్తోంది బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్. అయితే ఈ పేరు తప్పుగా పలకడంతో అర్నాబ్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
|
ట్విట్టర్ ద్వారా స్పందించిన సన్నీ లియోన్
తన పేరు ట్విట్టర్లో ట్రెండ్ అవుతుండటంతో..... సన్నీ లియోన్ కూడా స్పందించారు. నాకు ఎంత మెజారిటీ వస్తోంది? అంటూ ఫన్నీ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ ఇపుడు వైరల్ అవుతోంది. అర్నాబ్ చేసిన మిస్టేక్పై భారీగా సెటైర్లు పేలుతున్నాయి.
|
ఇప్పుడు ఆయన్ను ఏకిపారేస్తున్నారు
అర్నాబ్ గోస్వామి తన లైవ్ డిబేట్లలో రాజకీయ నాయకులను తనదైన శైలిలో ఏకి పారేస్తూ వివాదాస్పద జర్నలిస్టుగా పాపులర్ అయ్యారు. ప్రతి సారి ఆయన అందరినీ ఏకెయ్యడమే తప్ప ఆయన్ను ఏకేసే సమయం రాలేదు. ఇపుడు అవకాశం రావడంతో అర్నాబ్ గోస్వామి మీద ట్రోల్స్ ఓ రేంజిలో పేలుతున్నాయి.
సన్నీ డియోల్
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ బీజేపీ పార్టీ తరుపున గురుదాస్పూర్ లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేశారు. మధ్యహ్నం 2 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం సన్నీ డియోల్... కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ కుమార్ జకార్ మీద దాదాపు 50వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ బిజేపీ గెలుపు ఖాయమని తేలిపోయింది. సన్నీ డియోల్ తన ఎన్నికల అఫిడవిట్లో మొత్తం రూ. 87.18 కోట్ల విలువగల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.