Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కరీనా కొడుకు తైమూరుతో సినిమా.. మధుర్ బండార్కర్ క్లారిటీ
బాలీవుడ్ మీడియాకు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కుమారుడు తైమూర్ అలీ ఖాన్ అంటే పిచ్చి క్రేజ్. తైమూరు కనిపించాడంటే ఫోటోగ్రాఫర్లు వెంటపడటం తెలిసిందే. ఫోటోగ్రాఫర్ల వేధింపులు తట్టుకోలేక.. మీ కెమెరా ఫ్లాష్లతో మా అబ్బాయి కళ్లు పోతాయని సైఫ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తైమూర్పై నేషనల్ అవార్డు విజేత మధుర్ భండార్కర్ ఓ సినిమా తీస్తున్నట్టు బాలీవుడ్ పత్రికలు కోడై కూశాయి.
ఇటీవల ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన మధుర్ బండార్కర్ను తైమూర్తో సినిమా విషయాన్ని ప్రస్తావించగా.. ఆ వార్తలను కొట్టిపాడేశాడు. తైమూర్తో సినిమా తీస్తున్నట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని అన్నారు.
తాను తీసే తదుపరి చిత్రం టైటిల్ గాలీబ్ అని మధుర్ బండార్కర్ తెలిపారు. చాందీని బార్తో నా కెరీర్ మొదలై.. ఇందు సర్కార్ వరకు సాగింది. ప్రస్తుతం గాలీబ్ సినిమా కథపై పనిచేస్తున్నాం. ఇసుక మాఫియాపై సినిమా ఉంటుంది. గత 8 నెలలుగా పరిశోధన చేస్తున్నాం అని ఆయన వెల్లడించారు.
గతంలో కరీనా కపూర్తో హీరోయిన్ అనే చిత్రాన్ని రూపొందించారు. తాజాగా తైమూర్తో కూడా సినిమా రూపొందిస్తున్నట్టు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.