Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరీనా కొడుకు తైమూరుతో సినిమా.. మధుర్ బండార్కర్ క్లారిటీ
బాలీవుడ్ మీడియాకు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కుమారుడు తైమూర్ అలీ ఖాన్ అంటే పిచ్చి క్రేజ్. తైమూరు కనిపించాడంటే ఫోటోగ్రాఫర్లు వెంటపడటం తెలిసిందే. ఫోటోగ్రాఫర్ల వేధింపులు తట్టుకోలేక.. మీ కెమెరా ఫ్లాష్లతో మా అబ్బాయి కళ్లు పోతాయని సైఫ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తైమూర్పై నేషనల్ అవార్డు విజేత మధుర్ భండార్కర్ ఓ సినిమా తీస్తున్నట్టు బాలీవుడ్ పత్రికలు కోడై కూశాయి.
ఇటీవల ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన మధుర్ బండార్కర్ను తైమూర్తో సినిమా విషయాన్ని ప్రస్తావించగా.. ఆ వార్తలను కొట్టిపాడేశాడు. తైమూర్తో సినిమా తీస్తున్నట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని అన్నారు.
తాను తీసే తదుపరి చిత్రం టైటిల్ గాలీబ్ అని మధుర్ బండార్కర్ తెలిపారు. చాందీని బార్తో నా కెరీర్ మొదలై.. ఇందు సర్కార్ వరకు సాగింది. ప్రస్తుతం గాలీబ్ సినిమా కథపై పనిచేస్తున్నాం. ఇసుక మాఫియాపై సినిమా ఉంటుంది. గత 8 నెలలుగా పరిశోధన చేస్తున్నాం అని ఆయన వెల్లడించారు.
గతంలో కరీనా కపూర్తో హీరోయిన్ అనే చిత్రాన్ని రూపొందించారు. తాజాగా తైమూర్తో కూడా సినిమా రూపొందిస్తున్నట్టు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.