Don't Miss!
- Sports KKR vs RR: అతని వల్లే ఈ సెంచరీ: సునీల్ నరైన్
- News బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
ఎవరు ఎవరిపై ఆధారపడుతున్నారో తెలుసుకో.. కంగనాకు ఉప ముఖ్యమంత్రి చురక
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఫైర్ బ్రాండ్ అన్న సంగతి తెలిసిందే. కంగనా గురించి తెలిసిన వారెవ్వరూ ఆమెతో పెట్టుకోరు. ఆమెతో వాగ్వాదానికి దిగి గెలవడం మామూలు విషయం కాదు. బాలీవుడ్ను, వారసత్వాన్ని, బంధుప్రీతికి వ్యతిరేకంగా గళమెత్తే కంగనా.. పెద్ద పెద్ద స్టార్స్ను ఏకిపారేస్తుంది. బాలీవుడ్ క్వీన్గా మారిన కంగనా.. నటిగా జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కంగనా.. సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు మాత్రం విమర్శల పాలవుతుంటాయి.
పంగా ట్రైలర్ ఈవెంట్..
కంగనా ప్రస్తుతం పంగా అనే చిత్రంలో నటిస్తోంది. మహిళ, గృహిణి, తల్లిగా ఎన్ని కష్టాలుంటాయి.. అన్నింటిని దాటుకుని జాతీయ స్థాయిలో కబడ్డీ ప్లేయర్గా ఎదగాలన్న తన లక్ష్యాన్ని ఎలా చేరుకుందన్న కథతో పంగా అనే చిత్రం రాబోతోంది. ట్రైలర్ను బట్టి చూస్తే ఈ సినిమాలో కంగనా అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ రిలీజ్ చేసే ఈ ఈవెంట్లో కంగనా వివాదస్పద వ్యాఖ్యలు చేసింది.
కేవలం 3,4 శాతం మాత్రమే..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కొన్ని వర్గాల ప్రజలు చేస్తున్న ఆందోళనల్ని ఉద్దేశించి కంగన మాట్లాడింది. ‘ఆందోళన హింసాత్మకంగా ఉండకూడదు. మన దేశంలో కేవలం 3-4 శాంత మంది జనాభా మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. మిగిలిన వ్యక్తులు వీరిపైన ఆధారపడుతున్నారు. కాబట్టి బస్సుల్ని, రైళ్లని దగ్ధం చేసి... దేశంలో ఇలాంటి వాతావరణాన్ని సృష్టించే హక్కు ఎవరిచ్చారు?. ఓ బస్సు ధర రూ.80 లక్షల వరకు ఉంటుంది. అది తక్కువ మొత్తం కాదు' అని కాస్త ఘాటుగానే విమర్శించింది.
|
కౌంటర్ వేసిన ఉపముఖ్యమంత్రి
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కంగన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు . హింస, ప్రభుత్వ ఆస్తిని నాశనం చేయడం తప్పు, అది చట్టవిరుద్ధమే.. కానీ ఈ దేశం 3 శాతం మంది ప్రజల పన్నుపై ఆధారపడడం లేదని స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరు పన్ను చెల్లిస్తున్నారని పేర్కొన్నాడు.
ఎవరు ఎవరిపై ఆధారపడుతున్నారు..
పేదవాడి నుంచి ధనికుడి వరకు అందరూ ఏదో ఒక రూపంలో పన్ను కడుతున్నారని అన్నాడు. కూలి పని చేసేవారు కూడా పరోక్షంగా పన్నులు చెల్లిస్తున్నారని తెలిపాడు. ఉప్పులాంటి చౌక వస్తువులు కొన్నా.. వాటిపై ప్రభుత్వానికి పన్ను కడుతున్నారని చెప్పుకొచ్చాడు. ఓ సినిమా చూడటానికి థియేటర్కు వెళ్లినా నటీనటుల కోసం కొంత, వినోదపు పన్ను రూపంలో మరికొంత చెల్లిస్తున్నాడని చురకలంటించాడు. ఇప్పుడు ఆలోచించు.. ఎవరు ఎవరిపై ఆధారపడుతున్నారో అంటూ దిమ్మతిరిగే కౌంటర్ వేశాడు.