Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గోవాలో ప్రేయసితో అడ్డంగా బుక్కైన అదితిరావు హైదరీ మాజీ భర్త
అదితి రావ్ హైదరీ పేరు వింటేనే తెలుగు జనాల మనసు సుమనోహరంగా మారిపోతంది. అయితే చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం ఏమిటంటే ఆమె.. సినిమాల్లోకి రాకముందే, 21ఏళ్ల ప్రాయంలోనే ఓసారి పెళ్లాడింది. కొంతకాలానికే ఆ పెళ్లి పెటాకులు కూడా అయింది. ఇదంతా జరిగిన తరువాతే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తోంది. అయితే ఇప్పుడీ ముచ్చట ఎందుకబ్బా అంటారా? విషయం అమ్మాయి గురించి కాదు ఆమె భర్త సత్యదీప్ మిశ్రా గురించి.
అదితితో విడిపోయిన తరువాత చాలాకాలం సింగిల్ గానే నెట్టుకువచ్చేసిన సత్యదీప్ మిశ్రా ఇప్పుడు మరోసారి ప్రేమలో పడ్డాడు. అమ్మాయి మరెవరో కాదు డిజైనర్ మసాబా గుప్తా. అదేనండి ప్రముఖ నటీమణి నీనా గుప్తా, క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ గారాలపట్టి. ప్రస్తుతం వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారట.
మసాబా గుప్తా కూడా రెండో ప్రణయం అనే చెప్పాలి. గతంలో మధు మంతెన అనే తెలుగబ్బాయిని పెళ్లాడింది మసాబా. 2015లో మధుతో పెళ్లి జరగ్గా, 2019లోనే వీరికి విడాకులు మంజూరు అయ్యాయి. మరోవైపు సత్యజీత్ కూడా 2009లోనే తనకన్నా వయసులో చాలా చిన్నదైన అతిథి రావ్ ను పెళ్లాడాడు. పలు కారణాలతో 2013లో విడిపోయారు.
స్వతహాగా తన పర్శనల్ లైఫ్ గురించి ఎక్కడా చర్చించని మసాబా తన తాజా ప్రేమాయణం గురించి ఎంత దాచాలనుకున్నా దాగలేదు. ప్రస్తుతం సత్యదీప్ మిశ్రాతో డేటింగ్ చేస్తున్న మసాబా, గోవాలో సరదాగా గడిపేందుకు వెళ్లి లాక్ డౌన్ పుణ్యమాని అక్కడే ఇరుక్కుపోయింది. దీంతో వారిద్దరూ అడ్డంగా బుక్కయ్యారు. ఇక ఈ విషయం ఇలా బయటపడటంతో వారి రహస్య శృంగార జీవితం బయటకు వచ్చింది.