Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సుశాంత్పై విష ప్రయోగం జరిగిందా? పోలీసుల చేతికి విసేరా రిపోర్టు.. అనుమానాలపై క్లారిటీ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత పలువురు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై ముంబై పోలీసులు దృష్టిపెట్టారు. ఈ యువ నటుడి మరణం తర్వాత రోజు రోజుకు సందేహాలు జోరందుకోవడంతో వీలైనంత మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇలాంటి క్రమంలోనే గతవారం పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్టును కూపర్ హాస్పిటల్ వైద్యబృందం నుంచి అందుకొన్న ముంబై పోలీసులు పలువురిని విచారించారు. తాజాగా బాంద్రా పోలీసుల చేతికి విసేరా రిపోర్టు అందింది. ఈ ఆ రిపోర్టులో ఏమున్నదంటే..
ఆత్మహత్య వెనుక కారణాలపై
జూన్ 14న సూసైడ్ చేసుకొన్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును యాక్సిండెంటల్గా నమోదు చేసుకొన్న బాంద్రా పోలీసులు ఆ తర్వాత విచారణలో భాగంగా వెల్లడైన వాస్తవాలను బేరిజు వేసుకొని ఇటీవల ఆ కేసును సూసైడ్ కేసుగా మార్చారు. దర్యాప్తును వేగవంతం చేసి.. సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏమై ఉంటాయనే కోణంలో విచారణ చేపట్టారు.
హీరోయిన్లు, స్నేహితులతోపాటు 28 మందిని విచారణ
ఇదిలా ఉండగా, గత 15 రోజులకుపైగా విచారణలో ముంబై పోలీసులు అనేక విషయాలను అధికారికంగా ధృవీకరించుకొన్నారు. దిల్ బేచారా హీరోయిన్ సంజనా సంఘీ, సుశాంత్ స్నేహితుడు ముఖేష్ చబ్రా, ప్రియురాలు రియా చక్రవర్తి, క్యాస్టింగ్ డైరెక్టర్ షాను శర్మను రెండుసార్లు విచారించడంతో ముంబై పోలీసుల దర్యాప్తుపై ఆసక్తి పెరుతుగుతున్నది. ఇలా దాదాపు 28 మందిని విచారణకు పిలిచి ప్రశ్నించారు.
విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో
పూర్తిస్థాయి రిపోర్టులో శ్వాస అందకపోవడం వల్లే సుశాంత్ మరణం సంభవించిందనే విషయాన్ని ధృవీకరించారు. ఆ క్రమంలో సుశాంత్పై ఏదైనా విషప్రయోగం జరిగిందా అని తెలుసుకోవడానికి శరీరంలోని కీలక అవయవాల (విసేరా)ను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కు పంపించారు. విసేరా రిపోర్టులో నెగిటివ్ ఫలితాలు రావడంతో పోలీసులు విషయ ప్రయోగం జరగలేదనే విషయంపై నిర్ధారణకు వస్తున్నారు.
Recommended Video
ఫొరెన్సిక్ రిపోర్టు నెగిటివ్
తాజా ఫొరెన్సిక్ నిపుణుల విభాగం ముంబై పోలీసులకు సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టును అందజేశారు. విషయం ప్రయోగం జరిగిందా అనే కోణంలో పరిశోధన చేసిన ఫొరెన్సిక్ విభాగానికి ఎలాంటి అనుమానాస్పద పదార్థాలు, కెమికల్, విషపూరితమైన ఆనవాళ్లు ఏమి కనిపించలేదని రిపోర్టులో పేర్కొన్నారు. దాంతో సుశాంత్పై ఎలాంటి విష ప్రయోగం జరుగలేదనే విషయాన్ని మరోసారి తమ దర్త్యాప్తులో తెలుసుకొన్నారు.