Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
RajKundra కేసులో మరో ట్విస్ట్.. ఆ కేసు ప్రాపర్టీ సెల్ కి బదిలీ!
పోర్న్ ఫిలిమ్స్ షూట్ చేసి యాప్ లో ప్రసారం చేసిన కేసులో వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఇబ్బందులు ఇప్పట్లో క్లియర్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. రాజ్ కుంద్రా పోర్న్ ఫిలిమ్స్ కేసులో రెండో ఎఫ్ఐఆర్ ముంబై క్రైమ్ బ్రాంచ్ యొక్క ప్రాపర్టీ సెల్కు బదిలీ చేయబడింది. ఈ కేసులో ఇప్పటివరకు రాజ్ కుంద్రా యొక్క హాట్షాట్ యాప్లో పనిచేసే ఇద్దరు నిర్మాతలతో సహా 4 మంది నిందితులు ఉన్నారు.మిగిలిన ఇద్దరు నిందితుల్లో ఒకరు గెహానా వశిష్ట్ అని అంటున్నారు.
రాజ్ కుంద్రా యాప్ హాట్షాట్లో తన సినిమాలు అప్లోడ్ చేసినట్లు బాధితురాలు తన స్టేట్మెంట్లో పోలీసులకు తెలిపింది. రాజ్ కుంద్రా పేరు నేరుగా ఎఫ్ఐఆర్ లో చేర్చబడలేదు. అయితే అతని పేరు వస్తే, పోలీసులు రెండవ కుంభకోణానికి సంబంధించి రాజ్ కుంద్రాను విచారిస్తారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ యొక్క ప్రాపర్టీ సెల్ గురువారం ఈ కేసును స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు వారు ఈ కేసు దర్యాప్తులో మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇంకా చాలా మంది బాధితులు ముందుకు వచ్చి తమ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తారని క్రైమ్ బ్రాంచ్ అభిప్రాయపడుతోంది. రాజ్ కుంద్రా అశ్లీల సినిమాలు చేసి తన యాప్లో విడుదల చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అశ్లీల రాకెట్ కేసు బయటపడింది. అప్పటి నుంచి, క్రమంగా సాక్షాలు కలెక్ట్ చేస్తూ మరియు బాధితుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. ఈ సందర్భంలో, ప్రతి రోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ కేసు తెరపైకి రాగానే రాజ్ కుంద్రా తన మొబైల్ నెంబర్ సహా మొబైల్ కూడా మార్చుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక మార్కెట్ రెగ్యులేటర్ సెబీ బుధవారం శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా మరియు వారి సంస్థకు రూ .3 లక్షల జరిమానా విధించింది.