Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రియుడి చేతిలో మోసపోయిన టివి నటి.. సోషల్ మీడియాలో పరిచయం, హోటల్ గదిలో దారుణంగా!
Recommended Video
ప్రేమలో మోసపోవడం, అత్యాచారాల బారీన పడడం వంటి కష్టాలు సాధారణ మహిళలకే కాదు.. సెలెబ్రెటీలకు సైతం ఎదురవుతున్నాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ టివి నటి దారుణంగా మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ సెలెబ్రిటీ కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవడం పోలీసులని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వారిద్దరికీ సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది.
మోడలింగ్ నుంచి నటిగా
ముంబైలో మోడలింగ్ లో రాణిస్తున్న ఆ యువతి ఇటీవల టివి నటిగా కూడా రాణిస్తోంది. పెళ్లి చేసుకుందాం అని నమ్మించి తన ప్రియుడు అత్యాచారం చేశాడని తాజగా ఆ నటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్ లో నమోదైన ఈ కేసుని విచారణ కొరకు ముంబైకి మార్చినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా ద్వారా
సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ క్రైం తరహాలోనే ఈ ఘటన కూడా జరిగింది. ఈ కేసులో ముద్దాయి 2014 లో ఆ నటికి కాలేజ్ మేట్ కావడం విశేషం. సోషల్ మీడియా ద్వారా తిరిగి వీరి స్నేహాన్ని పునరుద్దించుకున్నారు. చాటింగ్ తో నెమ్మదిగా ప్రారంభమైన వీరి స్నేహం ప్రేమగా మారింది.
ప్రియుడి కోసం ఢిల్లీకి
తన కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తానని ప్రియుడు చెప్పడంతో టివి నటి ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళింది. అక్కడ అతడు కొందరి స్నేహితులని, కుటుంబ సభ్యులని పరిచయం చేశాడు. కొన్ని రోజుల తరువాత త్వరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాం అని నమ్మించాడు.
రాజస్థాన్లోని హోటల్
రాజస్థాన్ లోని నిమ్రనా అనే పట్టణంలో మనం వివాహం చేసుకుందాం అని చెప్పి ప్రియురాలిని నమ్మించాడు. సెప్టెంబర్ 4న నిమ్రనాకు రావాలని నటితో చెప్పాడు. ఆమె ఆ పట్టణానికి వెళ్ళినతరువాత ఆళ్వార్ అనే హోటల్ లో కొన్ని రూమ్స్ బుక్ చేశాడు. మిగిలిన గదుల్లో తన స్నేహితులు ఉంటారని చెప్పాడు. అదే రోజు ఆమెని హోటల్ గదిలోనే అత్యాచారం చేసినట్లు నటి ఫిర్యాదు చేసింది.
పోలిసుల దర్యాప్తు
నటి పేరు బయటకు వెల్లడించకుండా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నటి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్స్ కింద ముద్దాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు సేకరించిన తరువాత ముద్దాయిని అదుపులోకి తీసుకుంటామని ముంబై పోలీసులు చెబుతున్నారు.