Don't Miss!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
గర్ల్ఫ్రెండ్ను పరిచయం చేస్తాడట: వైన్ తాగుతూ ... హీరోయిన్ దివాళి ప్లానింగ్!
బాలీవుడ్ సెలబ్రిటీలంతా ఇపుడు దివాళి మూడ్లో ఉన్నారు. ఇటీవలే ముంబైలో షారుక్-గౌరీ ఖాన్ గ్రాండ్ దివాళి బాష్ నిర్వహించారు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ పండగను స్పెషల్గా ప్లాన్ చేసుకుంటున్నారు.
ప్రభాస్ నాతో టచ్లో లేడు.. ఆ గొడవ జరిగాక మాట్లాడడం మానేశా.. కంగనా రనౌత్!
'మణికర్ణిక' మూవీ హీరోయిన్ కంగనా రనౌత్ ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ.... తన దివాళి ప్లానింగ్ గురించి వెల్లడించారు. ఈ సారి దివాళి ముంబైలో కాకుండా తన స్వస్థలం మనాలిలో కొత్తగా కట్టించుకున్న బంగ్లా 'కార్తీక్ నివాస్'లో జరుపుకోన్నట్లు తెలిపారు.
గర్ల్ ఫ్రెండును పరిచయం చేస్తాడు
మా ఫ్యామిలీ మొత్తం ఈ దివాళికి మనాలిలో కలుస్తున్నాం. ఇది మాకు చాలా స్పెషల్ దీపావళి. నా సోదరుడు తన గర్ల్ఫ్రెండ్ను మాకు పరిచయం చేసి తన రిలేషన్ షిప్ అఫీషియల్ గా ప్రకటించబోతున్నాడు.... అని కంగనా రనౌత్ వెల్లడించారు.
మేనల్లుడికి ఇబ్బంది కలగకుండా....
మా మేనల్లుడు పృథ్విరాజ్కు కూడా ఇది మొదటి పుట్టినరోజు. మా బుజ్జి మేనల్లుడికి ఇబ్బంది కలుగకుండా శబ్దం లేని క్రాకర్స్ మాత్రమే కాల్చాలనుకుంటున్నామని కంగనా వెల్లడించారు.
వింటేజ్ వైన్, మ్యూజిక్
మేము జరుపుకునే దివాళి వేడుకలో వింటేజ్ వైన్, మ్యూజిక్ కూడా భాగం కాబోతున్నాయి. ఈ సందర్భంగా నేను నా గ్రాండ్ పియానో వాయిస్తూ వైన్ సేవిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ చేసుకోవాలనుకుంటున్నాను అని తెలిపారు.
కంగనా ‘మణికర్ణిక'
ప్రస్తుతం కంగనా రనౌత్ ‘మణికర్ణిక' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఝాన్సీ రాణి జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. మూడు రోజుల దివాళి సెలబ్రేషన్స్ అనంతరం కంగనా ‘మణికర్ణిక' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగం కాబోతున్నారు.
కంగనా నెక్ట్స్ ‘పంగా'
‘మణికర్ణిక' తర్వాత కంగనా రనౌత్ ‘పంగా' అనే చిత్రంలో నటించబోతున్నారు. అశ్వినీ ఐయ్యర్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కంగనా నేషనల్ లెవల్ కబడ్డీ ప్లేయర్గా కనిపించబోతున్నారు.