Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రముఖ నటుడు మృతి.. ప్రధాని మోడీ సంతాపం
అలనాటి బాలీవుడ్ ప్రముఖ నటుడు దిన్యర్ కాంట్రాక్టర్ (80) ఈ రోజు మృతి చెందారు. వృద్దాప్యంలో ఉన్న ఆయన అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దిన్యర్ కాంట్రాక్టర్ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
'చోరీ చోరీ చుప్కే చుప్కే', 'దిల్ విల్ ప్యార్ వ్యార్', 'ఖిలాడీ', 'బాద్షా' వంటి ఎన్నో సినిమాల్లో నటించారు దిన్యర్ కాంట్రాక్టర్. పలు చిత్రాల్లో ఆయన చేసిన కామెడీ బాలీవుడ్ జనం ఏ నాటికి మరచిపోలేరు. ఆయన టాలెంట్ గుర్తించిన భారత ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే పద్మశ్రీతో దిన్యర్ కాంట్రాక్టర్ని సత్కరించింది.
Padma Shri Dinyar Contractor was special because he spread lots of happiness. His versatile acting brought smiles on several faces. Be it theatre, television or films, he excelled across all mediums. Saddened by his demise. My thoughts are with his family and admirers. pic.twitter.com/yV8JswP1g1
— Narendra Modi (@narendramodi) June 5, 2019
కాగా ఆయన మరణ వార్త తెలిసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా ఆయనకు తన సంతాపం ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ''పద్మశ్రీ దిన్యర్ కాంట్రాక్టర్ ఓ నటుడిగా ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులు పండేవి. థియేటర్, టీవీ, సినిమా ఇలామీడియం ఏదైనా సరే తన అద్భుతమైన నటనతో ఎందరో ముఖాలపై చిరునవ్వులు పూయించారు. డియర్ కాంట్రాక్టర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని పేర్కొంటూ దిన్యర్కు షేక్హ్యాండ్ ఇస్తున్నప్పుడు దిగిన ఫొటోను షేర్ చేశారు మోడీ.
గత కొన్నేళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సినీ నటులతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవలే ప్రముఖ బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్గణ్.. తండ్రి వీరూ దేవ్గణ్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వాళ్ల కుటుంబానికి మోడీ లేఖ రాసిన సంగతి తెలిసిందే.