Don't Miss!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నేను అది కోల్పోయాను.. లాక్డౌన్లో బాగా ఆలోచించా.. నటుడికి విడాకులిచ్చిన భార్య
విడాకులు, ప్రేమలు, పెళ్లిళ్లు రంగుల ప్రపంచంలో సర్వసాధారణమే. అయితే ఈ లాక్ డౌన్ మాత్రం ఓ నటుడి కొంప ముంచింది. ఈ ఏకాంత సమయంలో బాగా ఆలోచించి, ఇన్నేళ్లు కోల్పోయానో తెలుసుకున్న ఓ భార్య.. ఓ ప్రముఖ నటుడికి విడాకులు ఇచ్చేందుకు సిద్దమైంది. ఈ మేరకు వాట్సప్, ఈమెయిల్ ద్వారా విడాకుల నోటీసులు పంపినట్టు చెప్పుకొచ్చింది. మెయింటెన్స్ కింద కొంత మొత్తాన్ని కూడా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అసలింతకీ వారిద్దరి మధ్య జరిగిందేమిటో ఓ సారి చూద్దాం.
తాజాగా వెలుగులోకి..
బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విడాకుల వ్యవహారాం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 7న నవాజుద్దీన్ భార్య ఆలియా సిద్దిఖీ వాట్సప్ మెయిల్ ద్వారా విడాకుల నోటీస్ పంపింది. కానీ ఈ వార్త ఆలస్యం వెలగులోకి వచ్చింది. అయితే ఆయన మాత్రం ఇంత వరకు స్పందించలేదని, ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది.
పదేళ్ల నుంచీ సమస్యలే..
విడాకుల విషయంపై ఆలియా మాట్లాడుతూ.. ‘అందరి దృష్టికి తీసుకురాలేని ఎన్నో సమస్యలున్నాయ్.. కానీ అవన్నీ నేను ఎప్పుడు పబ్లిక్గాచెప్పలేదు.. పదేళ్ల క్రితం మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచీ సమస్యలు ఉన్నాయ్.
అది కోల్పోయాను..
ఈ లాక్ డౌన్ సమయం నాకు చాలా ఉపయోగపడింది. ఆత్మవిమర్శన చేసుకునే టైమ్ దొరికింది. ఆత్మ గౌరవం ఎంతో ముఖ్యమైంది. కానీ నేను అది పూర్తిగా కోల్పోయాను. నా వద్ద ఇప్పుడు అది లేదు. ఎవ్వరూ లేని దానిలా ఫీల్ అయ్యేదాన్ని. ఒంటరితనాన్నే అనుభించిన ఫీలింగ్ కలిగేది.
సొంత ఐడెంటీపైనే..
ఆయన సోదరుడు షమాస్ కూడా ఓ కారణమే. ఇక నేను నా నిజమైన గుర్తింపుకే మళ్లిపోవాలనుకుంటున్నాను. ఇకపై అంజనా కిషోర్ పాండేగానే ఉండాలనుకుంటున్నాను.. ఎవరి పేరు మీదో, ఐడెంటిపైనో బతకాలని అనుకోవడం లేదు.
కలిసే ఉద్దేశం లేదు..
భవిష్యత్తు గురించి అంతగా ఆలోచించలేదు.. ఏది అనిపిస్తే అది చేస్తున్నాను. కానీ ఇక ఈ బంధాన్ని మాత్రం కొనసాగించాలని అనుకోవడం లేదు. మళ్లీ కలిసే ఉద్దేశం కూడా లేదు. మా పిల్లల్ని నా కస్టడీలోనే ఉంచాలని కోరాను' అని చెప్పుకొచ్చింది. అయితే ఈ వ్యవహారంపై నవాజుద్దీన్ మాత్రం ఇంత వరకు స్పందించలేదు.