Don't Miss!
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
వీఐపీ గెస్ట్ గా ఆర్యన్ ఖాన్.. ఫోన్ లో డ్రగ్ ఛాట్, లోదుస్తుల్లో డ్రగ్స్.. కేసు నమోదుతో రంగంలోకి రియా లాయర్?
ముంబై నుంచి గోవా వెళ్తున్న లగ్జరీ క్రూయిజ్ షిప్పై అవినాష్ పాండే ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) శనివారం సాయంత్రం దాడి చేసింది. భారీ హై ప్రొఫైల్ డ్రగ్స్ పార్టీ జరగబోతోందనే ఉప్పందుకున్న బృందం దాడి చేయగా చాలా మంది హై ప్రొఫైల్ వ్యక్తులు పట్టుబడ్డారు. అలా నిర్బంధించిన వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కూడా ఉన్న క్రమంలో ఈ విషయం మరింత పెద్ద స్థాయికి చేరుకుంది. ఆర్యన్ ఖాన్ కూడా ప్రస్తుతం ఎన్సిబి కస్టడీలో ఉన్నాడు మరియు అతని విచారణ కొనసాగుతోంది. అయితే ఈ విచారణలో ఆర్యన్ ఖాన్ పలు కీలక వివరాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Chay Sam Divorce: హాట్ హాట్గా సమంత.. ఆ వీడియోలో మరీ పచ్చిగా.. ఇది కూడా విడాకులకు కారణమేనా!
ఆర్యన్ నుండి ఫీజు తీసుకోలేదు, ఫోన్లో దొరికిన డ్రగ్ చాట్లు?
ఎన్సిబి వర్గాల నుంచి మీడియాకు అందుతున్న సమాచారం మేరకులు ఆర్యన్ కావాలని ఈ పార్టీకి వెళ్ళలేదు. ఆయనని ఒక సెలబ్రిటీ ఫేస్ గా ఉంచేందుకు ఆహ్వానించారని అంటున్నారు. అందుకే పార్టీ కోసం ఆర్యన్ నుండి ఎటువంటి రుసుము తీసుకోలేదని చెప్పబడుతోంది. ఆర్యన్ను అదుపులోకి తీసుకున్న తర్వాత, అతని మొబైల్ ఫోన్ ను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఆర్యన్ తో పాటు అదుపులోకి తీసుకున్న వ్యక్తుల మొబైల్ ఫోన్ల నుంచి డ్రగ్స్ ఛాట్లు దొరికాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అందుతున్న సమాచారం మేరకు వారి వద్ద నుంచి కొన్ని మందులు కూడా ఆర్యన్ నుంచి రికవరీ చేయబడ్డాయి. ఆర్యన్ లెన్స్ బాక్స్ నుంచి డ్రగ్స్ రికవరీ చేసినట్లు చెబుతున్నారు. అయితే, అధికారులు దీనిని ఇంకా ధృవీకరించలేదు.
Chay Sam Divorce: సమంత, నాగ చైతన్య పర్సనల్ ఫొటోలు.. వీళ్లను ఇంత క్లోజ్గా ఎప్పుడూ చూసుండరు!
లోదుస్తులలో కూడా డ్రగ్స్ దాచబడ్డాయా?
అరెస్ట్ చేసిన వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. తమ ప్యాంటులను ప్రత్యేకంగా కుట్టడం, మహిళల పర్సుల హ్యాండిల్స్, లోదుస్తులలో సెపరేట్ గా కొన్ని అరలు, షర్ట్ కాలర్ మరియు బూట్ల లోపల కూడా స్పెషల్ ప్లేసులు ఏర్పాటు చేశారని తద్వారా డ్రగ్స్ దాచారని అధికార వర్గాలు తెలిపాయి.
NCB ఇప్పుడు ఆర్యన్ ఖాన్తో సహా నిర్బంధించబడిన వ్యక్తులలో ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో తెలుసుకోవడానికి మొదటి వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. ఇంతలో, ఆర్యన్ కేసును ప్రముఖ న్యాయవాది సతీష్ మనే షిండే ప్రాతినిధ్యం వహిస్తారనే వార్త కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మానేషిండే ఎన్సిబి కార్యాలయానికి చేరుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్స్ కేసులో, రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షావిక్ కేసును కూడా సతీష్ మానేషిండేనే వాదించారు.
పార్టీ ప్రవేశ రుసుము లక్షల రూపాయలు?
క్రూయిజ్ లో జరిగిన పార్టీకి దాదాపు 600 మంది పార్టీకి హాజరయ్యారని, ఎక్కువగా ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల నుండి వారంతా ఆహ్వానించబడ్డారని అంటున్నారు. పార్టీలో ఉన్న వారిలో ఎక్కువ మంది ఢిల్లీలోని ప్రముఖ కుటుంబాలకు చెందిన వారు. ఈ క్రూయిజ్ పార్టీని విదేశీ కంపెనీ మరియు ఒక వినోద ఛానల్ సంయుక్తంగా నిర్వహించాయని అంటున్నారు.
గోవాకు చెందిన ఒక హోటల్ యజమాని నుంచి ఏజెన్సీకి ఈ పార్టీ గురించి సమాచారం వచ్చింది. నిజానికి డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో కొన్ని రోజుల క్రితం ఈ హోటల్ యజమానిని అరెస్ట్ చేసింది. ఆ సమయంలో ఆయన నుండి డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అదే హోటల్ వ్యాపారి ఈ పార్టీకి తక్కువ పరిమాణంలో డ్రగ్స్ సరఫరా చేశారు. ఎన్సిబి వర్గాల సమాచారం ప్రకారం, రైడ్లోని క్రూయిజ్ షిప్ నుండి సుమారు 30 గ్రాముల చరాస్, 20 గ్రాముల కొకైన్, సుమారు 25 టాబ్లెట్ల ఎండిఎమ్ఎ డ్రగ్స్ మరియు సుమారు 10 గ్రాముల ఎండి డ్రగ్స్ లభించాయి.
కేసు కూడా?
ఇక ఇప్పుడు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్పై కేసు నమోదు చేసిందని ఎన్సిబి వర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ ఏజెన్సీ దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రశ్నించబడుతున్న వారి పేర్లు కూడా బయటకు వచ్చాయి అయితే ఇందులో ఆర్యన్ ఖాన్ పేరు కూడా ఉంది. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నూపుర్ సారిక, ఇష్మీత్ సింగ్, మోహక్ జైస్వాల్, విక్రాంత్ చోంకర్ మరియు గోమిత్ చోప్రాలను తమ కస్టడీలో విచారిస్తున్నట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే చెప్పారు.
Recommended Video
కేసు మీద పెరుగుతున్న ఆసక్తి
అదుపులోకి తీసుకున్న వారిలో అర్బాజ్ ఒక వ్యాపారి, నటుడు మరియు అతను ఆర్యన్ స్నేహితుడని అంటున్నారు. అర్బాజే ఈ రేవ్ పార్టీకి ఆర్యన్ను తీసుకెళ్లాడని చెప్పబడుతోంది. మోహక్, నూపూర్ మరియు గోమిత్ ఢిల్లీ నివాసులు. మోహక్ మరియు నూపూర్ ఫ్యాషన్ డిజైనర్లు కాగా నూపుర్ గోమిత్తో కలిసి ముంబైకి వచ్చాడు. గోమిత్ ఒక హెయిర్ స్టైలిస్ట్ అని అంటున్నారు. ఇంతలో, ప్రముఖ న్యాయవాది సతీష్ మనేషిండే ఆర్యన్ ఖాన్ కేసును వాదించబోతున్న నేపథ్యంలో ఈ కేసు మీద మరింత ఆసక్తి పెరుగుతోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.