రియా చక్రవర్తి సోదరుడిపై ఛార్జ్ షీట్.. అదే నిజమైతే చిక్కులు తప్పవు?
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పుడు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తి, సోదరుడు సౌవిక్ చక్రవర్తి తదితరులను నిందితులుగా నమోదు చేసింది. నిందితులందరిపై ఎన్సీబీ ప్రత్యేక కోర్టులో అభియోగాలు దాఖలు చేసింది. వీరంతా సుశాంత్ సింగ్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

రియా చక్రవర్తికి సమస్యలు
ఇక ఈ కేసు విచారణ సమయంలో రియా మరియు ఆమె సోదరుడు షౌవిక్ కోర్టుకు హాజరయ్యారు. NCB నిందితులపై 8(c) 20(b)(ii)(a), 22, 27, 27A, 28, 29, మరియు 30 సెక్షన్లు అలాగే నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాలతో సహా అభియోగాలు మోపింది. విచారణలో కోర్టు ఈ ఆరోపణలను అంగీకరిస్తే, రియా చక్రవర్తికి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

డిశ్చార్జ్ దరఖాస్తులు దాఖలు
ఈ విషయమై స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ సర్పాండే మాట్లాడుతూ.. చార్జిషీట్లోని నిందితులందరిపై అభియోగాలు నమోదు చేసినట్లు తెలిపారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు సౌవిక్ డ్రగ్స్ వాడారని అలాగే అతను సుశాంత్ సింగ్ రాజ్పుత్ కోసం డ్రగ్స్ కొన్నాడని అన్నారు. కోర్టు అందరిపై అభియోగాలు మోపబోతోందని, అయితే కొంతమంది నిందితులు డిశ్చార్జ్ దరఖాస్తులు దాఖలు చేసినందున అది జరగలేదని అతుల్ సపర్పాండే చెప్పారు. దీంతో కోర్టు నిర్ణయం తీసుకోలేదన్నారు.

జీవితం చిన్నాభిన్నమై
డిశ్చార్జి దరఖాస్తుపై నిర్ణయం తీసుకున్న తర్వాతే నిందితులపై అభియోగాలు నమోదు చేస్తామని కోర్టు పేర్కొంది. మరోవైపు ప్రత్యేక న్యాయమూర్తి వీజీ రఘువంశీ ఆధ్వర్యంలో ఈ కేసుపై తదుపరి విచారణ జూలై 12న జరగనుంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ 14 జూన్ 2020న ముంబైలోని తన ఫ్లాట్లో శవమై కనిపించారు. బాలీవుడ్ లో నటుడిగా దూసుకుపోతున్న టైంలో యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుట్ జీవితం చిన్నాభిన్నమైనది.

అరెస్ట్-విడుదల
సుశాంత్ మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. అప్పటి నుండి ఈ కేసులో ఎన్సిబి డ్రగ్స్ కోణం నుండి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులోనే రియా చక్రవర్తిని సెప్టెంబర్ 2020 న అరెస్టు చేశారు. దాదాపు నెల రోజుల జైలు శిక్ష తర్వాత రియాకు బాంబే హైకోర్టు నుంచి బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును విచారిస్తోంది.

ఎమోషల్ పోస్ట్
అయితే, ఇప్పటి వరకు ఏజెన్సీ ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు. ఇక ఇదిలా ఉండగా ఈ ఏడాది సుశాంత్ జయంతి సందర్భంగా రియా చక్రవర్తి సోషల్ మీడియాలో ఎమోషల్ పోస్ట్ పెట్టింది. సుశాంత్ తో ప్రేమలో ఉన్నప్పుడు అతడితో సరదాగా గడిపిన వీడియోని రియా చక్రవర్తి షేర్ చేసింది. '


Click it and Unblock the Notifications











