Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆలియా తల్లినీ విడిచిపెట్టని బంధుప్రీతి సెగ.. ఇన్స్టా లో వెనక్కు తగ్గిన సోనీ రాజ్దాన్
బాలీవుడ్ లో రోజు రోజుకీ నెపోటిజం సెగ రాజుకుంటూనే ఉంది. సుశాంత్ మరణంతో అతడి ఫ్యాన్స్, సానుభూతి పరులు ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక సుశాంత్ మరణంతో భట్ ల హస్తం ఉందన్న వార్త చక్కర్లు కొడుతుంటడంతో, వారి కుటుంబం మొత్తం ఆత్మరక్షణలో పడింది.
నెపోటిజం చర్చకు ఆలియా ప్రధాన వేదికగా మారడంతో, ఆమెపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో కొంతకాలం క్రితం ఆలియా ఇన్స్టా అకౌంట్ లో కామెంట్ సెక్షన్ ను నిలిపివేసింది. అయితే రోజులు గడుస్తున్నా వారి కుటుంబం పట్ల జనాలకు ఏమాత్రం కనికరం కలగలేదనే తెలుస్తోంది. తాజాగా ఆలియా తల్లి సోనీ రాజ్దాన్ కూడా సోషల్ మీడియా లో వెనక్కు తగ్గిన వైనం దీనికి ఊతమిస్తోంది.
ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ సెక్షన్ ను క్లోజ్ చేసిన సోనీ, ఇలా చేయడం ఎంతో బాధాకరమని ఓ సుధీర్ఘమైన పోస్ట్ ను పెట్టారు. కొంతమంది కక్షసాధింపో లేదా, ఎవరైనా డబ్బులిచ్చి ఇలాంటి ట్రాలింగ్ ను ఉసిగొల్పుతున్నారో తెలియడం లేదని, కానీ, ఇలాంటి జనాలకు ట్రాలింగ్ చేసేందుకు మరో లక్ష్యం దొరికేంతవరకూ ఇలా చేయక తప్పదని స్పష్టం పోస్ట్ చేశారు.