Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ కోసం రంగంలోకి ఎన్ఐఏ.. ఇప్పుడైనా నిజం బయటపడుతుందా..?
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది అనేక రకాల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అసలు ఈ మిస్టరీలో ఉన్న రహస్యం ఏమిటనేది ఇంతవరకు బయటపడలేదు. ముంబై, బీహార్ పోలీసులతొ పాటు సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోలు బ్యూరోలు ఈ కేసుపై అనేక రకాలుగా ఇన్వెస్టిగేట్ చేశాయి.
మరో మలుపు తిరిగింది
ఇక ఇప్పుడు జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ)ను కూడా అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడంతో మరో మలుపు తిరిగింది. ఎక్కడ మొదలైంది.. ఎక్కడకి వెళుతోంది అనే విషయం ఇప్పుడు అందరిలో అనేక సందేహాలను కలిగిస్తోంది. సూసైడ్ చేసుకున్న కోణంలోనే కేసును దాదాపు క్లోజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ తరువాత నెపోటిజమ్ అలాగే డ్రగ్స్ వివాదం చుట్టూ కథనాలు వెలువడ్డాయి.
రంగంలోకి ఎన్ఐఏ..
ముఖ్యంగా డ్రగ్స్ రాకెట్ వైపే ఇన్వెస్టిగేషన్ ఎక్కువగా కొనసాగడం ఆశ్చర్యనికి గురి చేస్తోంది. సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోలు బ్యూరోలు దర్యాప్తు చేసిన సుశాంత్ కేసులో నాలుగవ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగడానికి సిద్ధమైంది. జూన్ 14వతేదీన సుశాంత్ మరణించిన విషయం తెలిసిందే. తన ఫ్లాట్ లో సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ఈ కేసును సీబీఐకు బదిలీ చేయించడంలో బీహార్ ప్రభుత్వం ముఖ్యపాత్ర పోషించింది.
ఎన్ఐఏకు అప్పగించడానికి కారణం..
సాధారణంగా ఎన్ఐఏ అంటే ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కేసులపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ముఖ్యంగా దానికోసమే ఆ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మానవ అక్రమ రవాణా, ఫేక్ కరెన్సీ, సైబర్ ఉగ్రవాద కేసులను డీల్ చేయడం కోసం కూడా చట్టంలో మార్పులు తెచ్చారు. ఇక ఇప్పుడు సుశాంత్ కేసులో డ్రగ్స్ ఆరోపణలు రావడంతో కేసును ఎన్ఐఏకు మళ్లించినట్లు తెలుస్తోంది.
Recommended Video
మాదకద్రవ్యాలు, మనీలాండరింగ్..?
అండర్ సెక్రటరీ బిశ్వజిత్ సర్కారు సుశాంత్ కేసులో మాదకద్రవ్యాల కేసుల దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగిస్తూన్నట్లు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మాదకద్రవ్యాలు, మనీలాండరింగ్, వంటి పరిమాలతో పాటు జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇక ప్రస్తుతం రియా చక్రవర్తి కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఆమె బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు.