Don't Miss!
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Lifestyle తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! మన పుట్టినరోజున అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రియాంకకు అదిరిపోయే గిప్ట్.. జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేసిన భర్త
ఎన్నో భాషల్లో సినిమాలు చేసి ఇండియాలోనే టాప్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది ప్రియాంక చోప్రా. భారతదేశంలోని చాలా ఇండస్ట్రీల్లో ఆమె సినిమాలు చేసింది. ఇదే క్రమంలో హాలీవుడ్లోకీ అడుగు పెట్టింది. అక్కడ కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో నటించి మెప్పించింది. అదే సమయంలో అక్కడ నిక్ జోనస్ అనే ఓ సింగర్ నచ్చడంతో అతడితో డేటింగ్ చేసేసింది. ఆ తర్వాత అతడినే పెళ్లి చేసుకుంది. ఇక్కడ షూటింగ్ లేని సమయంలో ఇప్పుడు భర్తతో పాటు అమెరికాలో ఉంటోంది.
ప్రియాంక - నిక్ డేటింగ్ చేసిన సమయం నుంచే తరచూ వార్తల్లో నిలిచే వారు. ఇక వివాహం జరిగిన తర్వాత ప్రియాంకలో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఆమె అక్కడి కల్చర్కు బాగా అలవాటు పడిపోయింది. గతంలో పబ్లిక్లో భర్తను లిప్ లాక్ ఇవ్వడం వంటివి చేసింది. ఇది అక్కడ సర్వసాధారణమే అయినా.. మన దేశంలో కాదు కాబట్టి ప్రియాంకను నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. అయినా, ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో ఆమె నిరంతరం హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
తాజాగా నిక్ - ప్రియాంక గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇది బీ టౌన్లో చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటనే కదా మీ సందేహం.? డిసెంబర్ 1న ఈ జంట మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకోనుంది. దీనిని వీళ్లిద్దరూ కలిసి గ్రాండ్గా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిక్.. ప్రియాంకకు జీవితాంతం గుర్తుండిపోయే ఓ బహుమతిని ఇవ్వబోతున్నాడట. ఇంతకీ ఆ బహుమతి ఏంటని బాలీవుడ్ వర్గాలతో పాటు ప్రియాంక ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రియాంక చోప్రా - నిక్ జోనస్ 2018 డిసెంబర్ 1న రాజస్థాన్లోని ఉమైద్ భవన్లో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వీరి పెళ్లిలో రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ తర్వాత ముంబయిలో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరై దంపతులను ఆశీర్వదించారు.