Don't Miss!
- Sports రోహిత్పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ప్రభాస్ కొత్త సినిమా నుంచి సర్ప్రైజ్ ఉండదా? తెరపైకి వచ్చిన షాకింగ్ న్యూస్
తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన హీరోల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్తో సత్తా చాటిన అతడు.. ఆ వెంటనే 'సాహో' అనే సినిమా చేసి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక, ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాను చేస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మరో మూడు ప్రాజెక్టులను కూడా ప్రకటించాడు. అందులో డైరెక్ట్ బాలీవుడ్ మూవీ కూడా ఒకటి ఉన్న విషయం తెలిసిందే. అదే 'ఆదిపురుష్'. తాజాగా ఈ సినిమా నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
చారిత్రక చిత్రాల దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. రామాయణంలోని సరికొత్త పాయింట్తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి కానుకగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ కాబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అందులో రాముడి పట్టాభిషేకానికి సంబంధించిన స్టిల్ను చూపించబోతున్నారని కూడా టాక్ వినిపించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. 'ఆదిపురుష్' సినిమా నుంచి శ్రీరామనవమికి సర్ప్రైజ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయట.
ముంబై నగరంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' షూటింగ్ను నాలుగు రోజుల క్రితమే ఆపేశారు. ఇప్పుడు అక్కడ లాక్డౌన్ కూడా విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా నుంచి సర్ప్రైజ్ రాకపోవచ్చని బీ టౌన్లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ రావణుడిగా చేస్తున్నారు. టాల్ బ్యూటీ కృతి సనన్ సీతగా చేస్తోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు.