Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అనురాగ్ కశ్యప్కు నార్కో, లైడిటెక్టర్ పరీక్షలు.. పాయల్ ఘోష్ పిటిషన్ దాఖలు
లైంగికదాడి కేసులో ముంబై పోలీసుల విచారణకు హాజరైన దర్శకుడు అనురాగ్ కశ్యప్పై హీరోయిన్ పాయల్ ఘోష్ మరోసారి విరుచుకుపడ్డారు. పోలీసుల విచారణ తర్వాత తన లాయర్ చేత అనురాగ్ కశ్యప్ విడుదల చేసిన ప్రకటనను పాయల్ తప్పుబట్టారు. గురువారం అనురాగ్ కశ్యప్ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించిన విషయం తెలిసిందే. అనంతరం తన లాయర్ చేత విడుదల చేసిన ఓ ప్రకటనలో..
శ్రీలంకలో ఉన్నానంటూ..
పాయల్ ఘోష్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. తనపై లైంగిక దాడి చేసినట్టు చెబుతున్న సమయంలో తాను శ్రీలంకలో షూటింగులో ఉన్నాను. ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ఆమె చట్టాలను అగౌరవిస్తున్నారు అంటూ తన లాయర్ ప్రియాంక ద్వారా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తాను శ్రీలంకలో ఉన్నట్టు ఆధారాలను పోలీసులకు ఇచ్చినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
కేసు నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నాలు
అయితే అనురాగ్ కశ్యప్ ముంబై పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. తన ఆరోపణలు తప్పు అంటూ ఈ కేసు నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అనురాగ్ కశ్యప్కు నార్కో పరీక్షలు నిర్వహించాలని తన తరఫు లాయర్ పిటిషన్ దాఖలు చేయనున్నారు అని పాయల్ ట్వీట్ చేశారు.
అనురాగ్ కశ్యప్కు నార్కో పరీక్షలు జరిపించాలి
పాయల్ ట్వీట్ చేస్తూ మిస్టర్ కశ్యప్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో అబద్దాలు ఆడారు. ఆయన చేత నిజాలు చెప్పించడానికి నార్కోటిక్ అనాలిసిస్, లై డిటెక్టర్, పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించేలా నా లాయర్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. నాకు న్యాయం జరిగేందుకు ఇలాంటి పరీక్షలు అవసరం అని పాయల్ ఘోష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. తన ట్వీట్ను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేశారు.
Recommended Video
లైంగిక దాడి ఆరోపణలు చేశారంటూ
ఇటీవల దర్శకుడు అనురాగ్ కశ్యప్పై పాయల్ ఘోష్ లైంగిక దాడి ఆరోపణలు చేయడం బాలీవుడ్లో సంచలనం రేపింది. 2013లో ఆఫర్ ఇస్తానని చెప్పి తనను ఇంటికి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డారు అని ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అనురాగ్ కశ్యప్ ముంబై పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ప్రకటనను విడుదల చేశారు.