Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘కేదార్నాథ్’ మూవీకి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ కోట్టివేసిన కోర్టు
సారా అలీ ఖాన్ హీరోయిన్గా పరిచయం అవుతూ తెరకెక్కిన 'కేదార్నాథ్' చిత్రం చుట్టూ పలు వివాదాలు ముసురుకున్న సంగతి తెలిసిందే. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ చిత్రం ఉందని, దీనిపై బ్యాన్ విధించాలనే డిమాండ్స్ సైతం గతంలో వినిపించాయి. సారా అలీ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ జంటగా నటించిన ఈ చిత్రానికి అభిషేక్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా 'కేదార్నాథ్' వ్యతిరేకంగా పిటీషన్ దాఖలవ్వగా... బాంబే హైకోర్ట్ దాన్ని తోసి పుచ్చింది. కేదార్నాథ్ పుణ్యక్షేత్రాన్ని బేస్ చేసుకుని ప్రేమ కథా చిత్రాన్ని తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ పిటీషన్ దాఖలైంది. సెన్సార్ బోర్డ్ మరోసారి ఈ సినిమా కథను పున:సమీక్షించేలా ఆదేశాలు జారీ చేయాలని అందులో పేర్కొన్నారు.
కేదార్నాథ్ సినిమా నిర్మాత తరుపున వాదించిన అడ్వకేట్ ప్రసాద్... సినిమా కేదార్నాథ్ బ్యాక్ డ్రాపుతో తెరకెక్కిన చిత్రం కాబట్టే ఆ టెంపుల్ చూపించామని తెలిపారు. ఒక ప్రాంతం నేపథ్యంలో సినిమా వస్తున్నపుడు ఆ ప్రాంతంలోని ప్రదేశాలు, దేవాలయాలు చూపించకుండా సినిమా తీయడం సాధ్యం కాదు అన్నారు.
2012లో వచ్చిన 'ఓ మై గాడ్' సినిమా లార్డ్ కృష్ణ మీద తీశారు. ఆ తర్వాత 'పికె'లో కొందరు బాబాలను చూపించినపుడు కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. యూపి గవర్నమెంట్ సైఫ్ అలీ ఖాన్-దీపిక పదుకోన్ 'ఆరక్షణ్' సినిమాపై బ్యాన్ విధించింది. ఆయా కేసుల్లో సుప్రీం కోర్టు ఒకటే చెప్పింది. ఒకసారి సెన్సార్ బోర్డ్ సర్టిఫై చేసి గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కోర్టులు కల్పించుకోకూడదని సూచింది అని వాధించారు.
సినిమా విడుదలకు మరొక రోజు మాత్రమే ఉందని, ఈ సినిమాలో మత పరమైన మనోభావాలు దెబ్బతిన్నట్లు సెన్సార్ బోర్డ్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని నిర్మాత తరుపు లాయర్ వాదించారు. ఆయన వాదనతో ఏకీభవించిన బాంబే హైకోర్ట్... ఈ చిత్రానికి వ్యతిరేకంగా నమోదైన పిటీషన్ కొట్టిపారేసింది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిసెంబర్ 7న 'కేదార్నాథ్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.