Don't Miss!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Jacqueline Fernandez మాఫియా డాన్తో సెల్ఫీ.. ముద్దులు పెట్టుకొంటూ అడ్డంగా బుక్కైన శ్రీలంక బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ చాటుమాటు రొమాన్స్ బట్టబయలైంది. మాఫియా డాన్ సుకేష్ చంద్రశేఖర్తో డేటింగ్ వ్యవహారానికి సంబంధించిన ఫోటో లీక్ కావడం ఇప్పుడు బాలీవుడ్ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. కోట్లాది రూపాయల బలవంతపు వసూళ్ల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న సుకేష్తో రొమాంటిక్గా జాక్వలైన్ దిగిన ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది. మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్న జాక్వలైన్ అనైతిక ప్రేమ వ్యవహారం గురించిన వివరాల్లోకి వెళితే...
రాన్ బాక్సీ కంపెనీ ప్రమోటర్ల నుంచి
సుకేష్ చంద్రశేఖర్ విషయానికి వస్తే.. రాన్ బాక్సీ కంపెనీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మల్విందర్ సింగ్ నుంచి 200 కోట్ల మేర బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. వారిని బెదిరించి భారీగా డబ్బు రాబట్టుకొన్నాడనే అభియోగాలపై కేసు నమోదైంది. ఆ సమయంలో చెన్నై సముద్ర తీరంలో ఉన్న ఆయన నివాసంపై మెరుపు దాడులు నిర్వహించి రూ.85 లక్షల నగదు, భారీగా విలాసవంతమైన వస్తువులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. ఆయన ఇంటిలో డజనుకుపైగా లగ్జరీ కార్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.
200 కోట్ల మేర బలవంతపు వసూళ్లు
తమిళనాడుకు చెందిన సుకేష్ చంద్రశేఖర్ 200 కోట్ల మేర బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. ఆయన కొందరిని బెదిరింపులకు పాల్పడి భారీ మొత్తంలో అక్రమ సంపాదన కూడబెట్టుకొన్నారనే ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేశారు. దాంతో ఆయనను అరెస్ట్ చేసి తీహార్ జైలులో పెట్టారు. అయితే జైలు నుంచి జాక్వలైన్తో సుకేష్ ఫోన్లో సంప్రదింపులు జరిపారనే వార్తలు వెలుగు చేశాయి.
మానీలాండరింగ్ కేసులో జాక్వలైన్ను విచారించిన ఈడీ
సుకేశ్ అక్రమ సంపాదనకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జాక్వలైన్ను మూడుసార్లు ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. అయితే ఈ కేసులో ముద్దాయిగా కాకుండా సాక్షిగానే విచారించామంటూ ఈడీ అధికారులు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జాక్వలైన్ ముంబైలో ఖరీదైన, విలాసవంతమైన విల్లాను రూ.200 కోట్లకుపైగా వెచ్చించి కొనుగోలు చేశారు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నారనే రూమర్లు కూడా మీడియాలో వచ్చాయి.
చంద్రశేఖర్తో డేటింగ్ అంటూ
అయితే సుకేష్ చంద్రశేఖర్తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలను జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఖండించింది. అయితే ఆమె ఖండించిన కొద్ది రోజులకే సుకేశ్తో రొమాన్స్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వెలుగు చూసింది. గత ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో సుకేశ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైనప్పుడు జాక్వలైన్ ఆయనతో కలిసి సెల్ఫీ దిగిందిఅనే విషయం మీడియాలో చక్కర్లు కొడుతున్నది. సుకేష్ను కలుసుకోవడానికి జాక్వలైన్ ఫెర్నాండేజ్ నాలుగు సార్లు చెన్నైకి ప్రైవేట్ జెట్లో వెళ్లింది అని ఈడీ అధికారులు వెల్లడించారు.
బుగ్గపై జాక్వలైన్ ముద్దు.. రొమాంటిక్గా సెల్ఫీ
సుకేశ్
చంద్రశేఖర్తో
జాక్వలైన్
ఫెర్నాండేజ్
దిగిన
సెల్ఫీ
వైరల్
అవుతున్నది.
జాక్వలైన్
బుగ్గపై
ముద్దు
పెడుతూ
తన
ఫోన్తో
సెల్ఫీ
తీస్తూ
ఎదురుగా
అద్దంలో
చూసుకొంటూ
రొమాన్స్లో
మునిగిపోయారు.
జాక్వలైన్
ఫెర్నాండేజ్తో
దిగిన
సెల్ఫీ
ఐఫోన్
12తో
తీశాడు.
ఇజ్రాయెల్
సిమ్
కార్డుతో
కూడిన
ఫోన్ను
సుకేశ్
వాడారు
అని
ఈడీ
అధికారులు
వెల్లడించారు.
Recommended Video
జాక్వలైన్ ఫెర్నాండేజ్ కెరీర్
జాక్వలైన్ ఫెర్నాండేజ్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ లాంటి అగ్రహీరోలతో నటిస్తున్నారు. ఇటీవల సైఫ్, అర్జున్ కపూర్తో ఆమె నటించిన బూత్ పోలీస్ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం జాన్ అబ్రహంతో ఎటాక్ చిత్రంలో, సల్మాన్ ఖాన్తో కిక్2 చిత్రం, రణ్వీర్ సింగ్తో సర్కస్, అక్షయ్ కుమార్తో రామ్ సేతు, ఇంకా బచ్చన్ పాండే చిత్రాల్లో నటిస్తున్నారు.