Don't Miss!
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ముంబైలో ఓటు వేశాక రెచ్చిపోయిన కంగనా రనౌత్... అప్పుడు అన్నీ దారుణాలే!
Recommended Video
4వ దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ముంబైలో సోమవారం జరిగిన పోలింగ్లో పలువురు బాలీవుడ్ స్టార్స్ పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే కంగనా రనౌత్ ఓటు వేసిన అనంతరం తన నోటికి పని చెప్పారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు.
ఇండియాలో ప్రస్తుతం నిజమైన ఇండిపెండెన్స్ ఉందని, ఇటాలియన్ గవర్నమెంట్ నుంచి విముక్తి పొందామంటూ వ్యాఖ్యానించారు. ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వచ్చిన కంగనాను ఓటు ప్రాముఖ్యత గురించి చెప్పాలని కోరగా ఆమె పై విధంగా స్పందించారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి
‘ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఇది ఐదేళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే అవకాశం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇండియాలో ఇపుడు నిజమైన స్వాతంత్ర్యం ఉంది. అంతకు ముందు మనం మొఘల్, బ్రిటిష్, ఇటాలియన్ గవర్నమెంట్ పాలనలో సర్వెంట్లుగా ఉండేవారం. దయచేసి అందరూ తమ ఓటు హక్కు ద్వారా దేశాన్ని సుభిక్షంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి' అన్నారు.
అపుడు ఎక్కడ చూసినా దారుణ పరిస్థితులే
‘‘గత ప్రభుత్వ పాలనలో దేశం చాలా దుర్దశలో ఉండేది. ఎక్కడ చూసినా అత్యాచారాలు, పేదరికం, పొల్యూషన్. పొలిటీషియన్లు లండన్లో చిల్ అవుతూ ఉండేవారు, దారుణమైన పరిస్థితులు ఉండేది. ఇపుడు స్వరాజ్యం, స్వధర్మం నడుస్తోంది. దాన్ని కొనసాగించేలా ప్రతి ఒక్కరూ భారీ సంఖ్యలో ఓటింగులో పాల్గొనాలి'' అని కోరారు.
కంగనా మొండి ధైర్యం
కంగనా రనౌత్కు ముందు నుంచీ మొండి ధైర్యమే. తన మనసులో ఉన్న విషయాలను నిర్మొహమాటంగా బయటకు చెబుతూ ఉంటుంది. కొన్ని సందర్బాల్లో ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదమైన సందర్భాలూ ఉన్నాయి. ఆమె వ్యవహార శైలిని కొందరు విమర్శిస్తున్నప్పటికీ ఆమె తాను అనుకున్న దారిలోనే వెళుతున్నారు.
సినిమాలు
కంగనా రనౌత్ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే... ఈ ఏడాది ప్రారంభంలో ‘మణికర్ణిక' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ప్రస్తుతం ‘మెంటల్ హై క్యా' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు ‘పంగా' అనే స్పోర్ట్స్ మూవీ చేస్తున్నారు.