twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ డెత్: మూడు నెలల్లోనే 3కోట్లు మాయం చేసిన రియా.. మరో గుట్టు విప్పిన బీహార్ పోలీసులు!

    |

    బాలీవుడ్ యువ హీరో సుశాంత్ రాజ్ పుత్ సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఓ వైపు ముంబై పోలీసులు మరోవైపు బీహార్ పోలీసులు తీరిక లేకుండా అన్ని వైపులా విచారణ జరుపుతున్నారు. అయితే కేసు విషయంలో ఎక్కువగా బీహార్ పోలీసులు సంచలన విషయాలను బయటపెడుతుండడం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా రియకు సంబంధించిన మరో కీలక అంశాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది.

    ఎన్ని అనుమానాలు వస్తున్నా..

    ఎన్ని అనుమానాలు వస్తున్నా..

    సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి పాత్ర ఈ కేసులో ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే టాపిక్ బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమెపై అనేక రకాల ఆరోపణలు కథనాలు వేలువడుతున్నాయి. అయితే రియా మాత్రం కోర్టు కేసులో ఉన్నంత వరకు తాను ఏ విధంగాను స్పందించను అని న్యాయ వ్యవస్థ మీద తనకు పూర్తిగా నమ్మకం ఉందని వీడియో రిలీజ్ చేసింది.

    మూడు నెలల్లోనే 3కోట్లు?

    మూడు నెలల్లోనే 3కోట్లు?

    ఇక ఇంతలో రియా చక్రవర్తికి సంబంధించిన ఒక బ్యాంక్ ఎకౌంట్ ని పరిశీలించగా సుశాంత్ ఎకౌంట్ నుంచి మూడు నెలల్లోనే మూడు కోట్ల వరకు ఖర్చు చేసిందని కామెంట్స్ వస్తున్నాయి. ప్రాముఖ నేషనల్ మీడియా కథనం ప్రకారం సుశాంత్ సింగ్ బ్యాంక్ ఎకౌంట్స్ నుంచి రియా ఎకౌంట్ కి చాలా వరకు డబ్బులు వెళ్లాయని అయితే అందులో 90రోజుల్లోనే మూడు కోట్ల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.

    ముంబై పోలీసుల కంటే చురుగ్గా బీహార్ పోలీసులు

    ముంబై పోలీసుల కంటే చురుగ్గా బీహార్ పోలీసులు

    ఇప్పటికే సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆమెపై 15కోట్ల వరకు మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆఖరికి క్రెడిట్ కార్డు కూడా వదలకుండా రియా తన కొడుకును చీట్ చేసిందని అదే విధంగా వారి కుటుంబ సభ్యులు కూడా డబ్బులు గుంజారని సుశాంత్ తండ్రి FIR లో పేర్కొన్నారు. ఇక గత కొన్ని రోజులుగా ముంబై పోలీసుల కంటే చురుగ్గా ఈ కేసును బీహార్ పోలీసులు విచారిస్తున్నారు.

    Recommended Video

    #RheaChakraborty : రియకు సంబంధించిన మరో గుట్టు విప్పిన బీహార్ పోలీసులు! || Oneindia Telugu
    బ్యాంక్ అకౌంట్స్ పై స్పెషల్ ఫోకస్

    బ్యాంక్ అకౌంట్స్ పై స్పెషల్ ఫోకస్

    ఎక్కువగా సుశాంత్ బ్యాక్ అకౌంట్స్ పై విచారణ జరుపుతున్న అధికారులు గత కొన్ని నెలలుగా అతను ఎకౌంట్ నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్లాయనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. మరోవైపు రియా చక్రవర్తి బ్యాంక్ అకౌంట్స్ ని కూడా పోలీసులు స్పెషల్ గా పరిశీలిస్తున్నారు. ఇటీవల సెర్చింగ్ లో ఆమె సుశాంత్ డబ్బులు ఎక్కువగా వాడినట్లు తెలుస్తోంది.

    English summary
    Sushant Singh Rajput case: MP Manoj Tiwari rises voice for CBI investigation. He tweeted that, I request with folded hands to give justice to Sushant who died 43 days ago, but no FIR has been registered so far. In this situation, A video of Sushant Singh Rajput's Bed room goes viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X