Don't Miss!
- News భారత్లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్?
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
సడక్ 2 డిస్ లైకులపై స్పందించిన పూజా భట్, ట్రెండింగ్ లో ఉన్న ట్రైలర్
బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం రాజేసిన నెపోటిజం సెగ, రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో వస్తున్న నెపో కిడ్స్ సినిమాలు ఈ సెగకు ఆహుతి అవుతున్న వైనం కళ్లకు కడుతూనే ఉంది. శ్రీదేవి తనయ జాన్వి కపూర్ గుంజన్ సక్సేనా సినిమా వైఫల్యమే ఇందుకు తాజా ఉదహారణగా చెప్పొచ్చు. అయితే, సుశాంత్ కేసులో కీలకంగా మారిన మహేశ్ భట్ తాజా సినిమా సడక్ 2కు ఈ సెగ మరింత గట్టిగా తగులుతోంది.
ఇటీవలే విడుదలైన సడక్ 2 ట్రైలర్ కు సుమారు 60లక్షల డిస్ లైక్ లు పడగా, కేవలం 30వేల లైకులు మాత్రమే దక్కాయి. దీంతో సినిమా పని అయిపోయిందనే అంతా అనుకున్నారు. కానీ, అన్ని డిస్ లైక్ లు వచ్చినా, ట్రైలర్ ట్రెండింగ్ వీడియోల్లోకి వచ్చేసింది. అంటే, ట్రైలర్ ను ద్వేషిస్తూనే, జనాలు ఎక్కువగా దాన్ని చూసేస్తున్నారని అర్ధమవుతోంది.
ఇక సోషల్ మీడియాలో ఈ మధ్య కాస్త యాక్టివ్ గా మారిన మహేశ్ భట్ పెద్ద కూతురు పూజా భట్ సడక్ 2 ట్రైలర్ ట్రెండింగ్ లోకి రావడంపై స్పందించింది. జనాలు మెచ్చినా మెచ్చకపోయినా సడక్ 2 ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది, 'డిస్ లైక్ ల గురించి మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు' అని ఓ అభిమాని చేసిన ట్వీట్ కు రిప్లై ఇస్తూ, 'భాధేమీ లేదు. ప్రేమ/ద్వేషం అనేవి నాణేనికి రెండు ముఖాలు' అని ట్వీట్ చేసింది. 'రెండింటినీ మ్యానేజ్ చేయాలి, ట్రైలర్ ను ట్రెండింగ్ లోకి తీసుకువచ్చిన వారందరికీ ధన్యవాదాలు' అంటూ రిప్లై ఇచ్చింది. ఏమైనా ఇప్పటికైతే గండం గట్టేక్కినట్లే. మరి సినిమా విడుదల సమయానికి ఇంకెన్ని వివాదాలు వార్తలకు ఎక్కుతాయో చూడాలి.