పూనమ్ పాండే డెత్ డ్రామాపై కోర్టులో కేసు.. కఠినంగా శిక్షించాలంటూ ఫిర్యాదు
బాలీవుడ్లో శృంగారతార పూనమ్ పాండే మృతివార్త మీడియాను, సినీ పరిశ్రమను కుదిపేసింది. యుక్త వయసులో సర్వికల్ క్యాన్సర్తో ఆమె మరణించారనే విషయం అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే మరుసటి రోజు తాను మరణించలేదు. బతికే ఉన్నాను అని ఆమె ప్రకటన చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ వ్యవహారంలో నకలీ వార్తతో అందర్నీ చీట్ చేయడంపై న్యాయవాది స్పందించి కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
శృంగార తార పూనమ్ పాండే సర్వికల్ క్యాన్సర్తో మరణించారు. ఆమె ఇకలేరు అంటూ మేనేజర్ వార్తను మీడియాకు వెల్లడించారు. దాంతో సినీ, మీడియా రంగంలో ఈ వార్త సంచలనం రేపింది. పూనమ్ జీవితానికి సంబంధించిన వివరాలను మీడియా ప్రత్యేకంగా కవర్ చేసింది. అయితే అదంతా అవాస్తవం. నేను బతికే ఉన్నాను. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడానికి నేను ఈ డ్రామా ఆడాను అని పూనమ్ వీడియోను రిలీజ్ చేసింది.

పూనమ్ పాండే మరణం అంటూ నకిలీ, భూటకపు కథనాన్ని అల్లిన ఆమె మేనేజర్ నికితా శర్మపై ఓ న్యాయవాది కేసు నమోదు చేశారు. ఓ సెలబ్రిటీ మరణ వార్తతో ప్రేక్షకుల మనోభావాలను దెబ్బ తీశారు అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Recommended Video

సర్వికల్ క్యాన్పర్పై అవగాహన కల్పించడానికి పూనమ్ పాండే, ఆమె మేనేజర్ నికితా శర్మపై ఆడిన నాటకం అభ్యంతరకరం. మీడియాను, సినీ పరిశ్రమను తప్పుదోవ పట్టించారు. కాబట్టి వారికి తగిన శిక్ష విధించాలని న్యాయవాది అలీ కాషిఫ్ తన ఫిర్యాదులో కోర్టును కోరారు.


Click it and Unblock the Notifications











