Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
భయంగా ఉంది... క్వారంటైన్లో సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా
సీనియర్ నటి, ఐపిఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఇటీవల దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. వారం క్రితం లాస్ ఏంజిల్స్ నుండి దుబాయ్ కి చేరుకున్న ఆమె ఇప్పుడు క్వారంటైన్ లోనే ఉన్నారు. ఇక హోటల్ గదిలో ఉన్న ప్రీతి తన కోవిడ్ టెస్టులు గురించి ఇన్స్టాగ్రామ్ వీడియోలో తెలిపింది.
గత వారం నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో నాకు నెగిటివ్ వచ్చింది. ఇప్పటికే ఏడు రోజులు ముగియడంతో ఎంతగానో సంతోషిస్తున్నాను. కానీ కొంచెం భయంగా, ఆందోళనగా ఉంది. కానీ నేను రేపు బయటకు వెళ్లబోతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను నిజంగా ఎవరినీ కలవకపోయినా, కోవిడ్ పరీక్షలు జరగడం అలాగే క్వారంటైన్ లో ఉండడం నెర్వస్ గా ఉంది. ఈ ఆందోళన భయం ఎందుకో తెలియదు. మళ్ళీ పరీక్షలు నిర్వహించిన కూడా నెగెటివ్ వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంటుంది.. అని ప్రీతి జింటా తన వీడియోలో తెలిపింది.
ఇక హోటల్ గదిలోనే టైమ్ పాస్ చేస్తున్న ప్రీతి జింటా, తన అభిమానులకు సన్నిహితంగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా అన్నారు. త్వరలోనే తన క్రికెట్ టీమ్ సభ్యులతో కలిసి ఒక స్పెషల్ వీడియను షూట్ చేయబోతున్నట్లు తెలిపారు. రేపే నా ప్రయాణం మొదలవుతుంది. ఇప్పటివరకు కరోనా పరీక్షల్లో ఎక్కువగా నెగిటివ్ అనే వచ్చింది. ఇక మ్యాచ్ లు స్టార్ట్ కావడానికి ఇంకొంత సమయం ఉంది కాబట్టి తప్పకుండా షూటింగ్ కి సమయం దొరుకుతుందని ప్రీతి వివరణ ఇచ్చింది.