Don't Miss!
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
భయంగా ఉంది... క్వారంటైన్లో సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా
సీనియర్ నటి, ఐపిఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఇటీవల దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. వారం క్రితం లాస్ ఏంజిల్స్ నుండి దుబాయ్ కి చేరుకున్న ఆమె ఇప్పుడు క్వారంటైన్ లోనే ఉన్నారు. ఇక హోటల్ గదిలో ఉన్న ప్రీతి తన కోవిడ్ టెస్టులు గురించి ఇన్స్టాగ్రామ్ వీడియోలో తెలిపింది.
గత వారం నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో నాకు నెగిటివ్ వచ్చింది. ఇప్పటికే ఏడు రోజులు ముగియడంతో ఎంతగానో సంతోషిస్తున్నాను. కానీ కొంచెం భయంగా, ఆందోళనగా ఉంది. కానీ నేను రేపు బయటకు వెళ్లబోతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను నిజంగా ఎవరినీ కలవకపోయినా, కోవిడ్ పరీక్షలు జరగడం అలాగే క్వారంటైన్ లో ఉండడం నెర్వస్ గా ఉంది. ఈ ఆందోళన భయం ఎందుకో తెలియదు. మళ్ళీ పరీక్షలు నిర్వహించిన కూడా నెగెటివ్ వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంటుంది.. అని ప్రీతి జింటా తన వీడియోలో తెలిపింది.
ఇక హోటల్ గదిలోనే టైమ్ పాస్ చేస్తున్న ప్రీతి జింటా, తన అభిమానులకు సన్నిహితంగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా అన్నారు. త్వరలోనే తన క్రికెట్ టీమ్ సభ్యులతో కలిసి ఒక స్పెషల్ వీడియను షూట్ చేయబోతున్నట్లు తెలిపారు. రేపే నా ప్రయాణం మొదలవుతుంది. ఇప్పటివరకు కరోనా పరీక్షల్లో ఎక్కువగా నెగిటివ్ అనే వచ్చింది. ఇక మ్యాచ్ లు స్టార్ట్ కావడానికి ఇంకొంత సమయం ఉంది కాబట్టి తప్పకుండా షూటింగ్ కి సమయం దొరుకుతుందని ప్రీతి వివరణ ఇచ్చింది.