Don't Miss!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ తల్లిని కష్టపెట్టొద్దు.. గుండెలు పిండేసిన ప్రియాంక పోస్ట్
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన లాక్డౌన్ సమయాన్ని భర్త నిక్ జోనస్తో అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నది. కరోనావైరస్ బాధితులకు ఓ వైపు ఆర్థిక సహాయం, ఇతర రూపంలో హెల్ప్ చేస్తూనే అభిమానులతో లైవ్ ఛాటింగ్తో సమయాన్ని గడుపుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన జీవితానికి సంబంధించిన విషయాలను, తన సెల్ఫీలను అభిమానులతో పంచుకొంటున్నారు.
తాజాగా సూర్య కిరణాలు ఆమెను ముద్దాడుతున్నాయా? అనే విధంగా తీసిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రియాంక షేర్ చేసిన సెల్ఫీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ.. తమదైన శైలిలో కామెంట్లు వదులుతున్నారు. ఈ సెల్ఫీకి సుమారు 16 లక్షల లైక్స్ రావడం విశేషం.
ఇంటర్నేషనల్ ఎర్త్ డే సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్లో తన ఫోటోతోపాటు ఓ సందేశాన్ని అభిమానులకు వదిలారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం వేర్వేరుగా జీవిస్తున్నా. మనల్ని ఈ భూమత కలిపి ఉంచింది. ఇదే మనకు శాశ్వతమైన నివాసం. అలాంటి భూమాతను కాలుష్యం బారిన పడకుండా రక్షిద్దాం అని ప్రియాంక తన సందేశాన్ని పోస్టు చేశారు.
ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తున్న సమయంలో ప్రియాంక, నిక్ జోనస్ పలు రకాలుగా విరాళాలు ప్రకటించారు. యూనిసెఫ్, పీఎం కేర్స్, గూంజ్, ఫీడింగ్ అమెరికా లాంటి సంస్థలకు ప్రియాంక దంపతులు భారీగా విరాళాలు అందించారు.
కరోనాపై పోరాటానికి సంఘీభావం ప్రకటించేందుకు ప్రపంచ సినీ ప్రముఖులు పాల్గొన్న వన్ వరల్డ్: టుగెదర్ ఎట్ హోం అనే సంగీత విభావరిలో పాలుపంచుకొన్నారు. ఈ కార్యక్రమంలో లేడి గాగ, సర్ ఎల్టన్ జాన్, జాన్ లెజెండ్, ది రోలింగ్ స్టోన్స్, సామ్ స్మిత్, షాన్ మెండీస్, కెమిలా కాబెల్లో, షారుఖ్ తదితరులు పాల్గొన్నారు.