Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ తల్లిని కష్టపెట్టొద్దు.. గుండెలు పిండేసిన ప్రియాంక పోస్ట్
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన లాక్డౌన్ సమయాన్ని భర్త నిక్ జోనస్తో అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నది. కరోనావైరస్ బాధితులకు ఓ వైపు ఆర్థిక సహాయం, ఇతర రూపంలో హెల్ప్ చేస్తూనే అభిమానులతో లైవ్ ఛాటింగ్తో సమయాన్ని గడుపుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన జీవితానికి సంబంధించిన విషయాలను, తన సెల్ఫీలను అభిమానులతో పంచుకొంటున్నారు.
తాజాగా సూర్య కిరణాలు ఆమెను ముద్దాడుతున్నాయా? అనే విధంగా తీసిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రియాంక షేర్ చేసిన సెల్ఫీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ.. తమదైన శైలిలో కామెంట్లు వదులుతున్నారు. ఈ సెల్ఫీకి సుమారు 16 లక్షల లైక్స్ రావడం విశేషం.
ఇంటర్నేషనల్ ఎర్త్ డే సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్లో తన ఫోటోతోపాటు ఓ సందేశాన్ని అభిమానులకు వదిలారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం వేర్వేరుగా జీవిస్తున్నా. మనల్ని ఈ భూమత కలిపి ఉంచింది. ఇదే మనకు శాశ్వతమైన నివాసం. అలాంటి భూమాతను కాలుష్యం బారిన పడకుండా రక్షిద్దాం అని ప్రియాంక తన సందేశాన్ని పోస్టు చేశారు.
ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తున్న సమయంలో ప్రియాంక, నిక్ జోనస్ పలు రకాలుగా విరాళాలు ప్రకటించారు. యూనిసెఫ్, పీఎం కేర్స్, గూంజ్, ఫీడింగ్ అమెరికా లాంటి సంస్థలకు ప్రియాంక దంపతులు భారీగా విరాళాలు అందించారు.
కరోనాపై పోరాటానికి సంఘీభావం ప్రకటించేందుకు ప్రపంచ సినీ ప్రముఖులు పాల్గొన్న వన్ వరల్డ్: టుగెదర్ ఎట్ హోం అనే సంగీత విభావరిలో పాలుపంచుకొన్నారు. ఈ కార్యక్రమంలో లేడి గాగ, సర్ ఎల్టన్ జాన్, జాన్ లెజెండ్, ది రోలింగ్ స్టోన్స్, సామ్ స్మిత్, షాన్ మెండీస్, కెమిలా కాబెల్లో, షారుఖ్ తదితరులు పాల్గొన్నారు.