Don't Miss!
- News కడప కోర్టు ఆంక్షలపై హైకోర్టుకు సునీత..! వైసీపీపై కీలక వ్యాఖ్యలు..
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
సల్మాన్కు అవమానం.. భారత్ నుంచి తప్పుకున్న తరువాత ప్రియాంక చోప్రా ఏంచేసిందో తెలుసా!
Recommended Video
కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించబోయే 'భారత్' చిత్రానికి అంతా సిద్ధం అవుతోంది. ప్రముఖ దర్శకుడు అలీ జాఫర్ ఈ చిత్రానికి దర్శకుడు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ నటించబోతోంది. ప్రియాంక చోప్రా ఈ చిత్రానికి నో చెప్పింది. తాజగా ప్రచారం జరుగుతున్న విషయం ప్రియాంకపై సల్మాన్ ఖాన్ అభిమానులకు ఆగ్రహం కలిగించే విధంగా ఉంది. ఇది సల్మాన్ ని అవమానించడమే అని అంటున్నారు.
జంటగా చూడాలని
సల్మాన్ ఖాన్, ప్రియాంక కలసి నటించి చాలా కాలం అవుతోంది. ఇప్పుడు ప్రియాంక చోప్రా స్థాయి వేరు. ప్రియాంక ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయింది. హాలీవుడ్ లో సైతం పీసీ సత్తా చాటుతోంది. వీరిద్దరిని ఓ చిత్రంలో జంటగా చూడాలని అభిమానులు ముచ్చటపడ్డారు. కానీ ఆ కోరిక తెరలేదు.
భారత్కు నో
మొదట భారత్ చిత్రం కోసం అలీ జాఫర్ ప్రియాంక చోప్రాని సంప్రదించారు. కానీ ఈ చిత్రానికి పీసీ ఒప్పుకోలేదు. ఆమె త్వరలో వివాహం చేసుకోబోతోందని అందువలనే సల్మాన్ ఖాన్ సినిమాకు అంగీకరించలేదని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి.
దర్శకుడు కూడా
అలీ అబ్బాస్ కూడా పరోక్షంగా ఇదే విషయాన్ని ట్వీట్ చేశాడు. ప్రియాంక చోప్రా భారత్ చిత్రంలో నటించడం లేదు. దానికి కారణం చాలా ప్రత్యేకమైనది. ఆమె తన జీవితంలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది అంటూ ట్వీట్ చేశాడు. దీనితో ప్రియాంక, ఆమె ప్రియుడు నిక్ జోనస్ త్వరలో వివాహం జరుగుతుందనే వార్తలు బలపడ్డాయి.
సల్మాన్కు అవమానం
తాజాగా మీడియాలో వస్తున్న వార్తలతో సల్మాన్ అభిమానులు పీసీపై మండి పడుతున్నారు. ప్రియాంక చోప్రా భారత్ చిత్రానికి నో చెప్పిన తరువాత హాలీవుడ్ లో ఓ చిత్రానికి సైన్ చేసినట్లు అక్కడి మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది సల్మాన్ ఖాన్ ని అవమానించడమే అని అంటున్నారు.
యాక్షన్ చిత్రం
హాలీవుడ్ లో తెరకెక్కుతున్న కౌబాయ్ నింజా వికింగ్ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. క్రిస్ ప్రాట్ సరసన పీసీ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ వార్తలు నిజమైతే పీసీ మరో వివాదానికి అగ్గి రాజేసినట్లే.