Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రియాంకా నిక్ ఉదారత్వం... బీహార్, అస్సామ్ వరద భాధితులకు సహాయం
దేశీ గర్ల్ ప్రియాంకా చోప్రా, పెళ్లి చేసుకుని విదేశాల్లోనే స్థిరపడినప్పటికీ, ఆమె తన మూలాలను మాత్రం మరచిపోలేదు. ఎక్కడ ఉన్నా, ఆమె మనసు ఇక్కడ ఉందనటానికి తాజా సంఘటన మరో ఉదాహరణగా నిలస్తోంది. భర్తతో కలసి బీహార్, అస్సాం వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకువచ్చింది.
అసలే కరోనా సృష్టించిన అల్లకల్లోలంతో దేశం మొత్తం సతమతమవుతున్న తరుణంలో, ఉత్తరాదిన వరదలు భీభత్సాన్ని సృష్టించాయి. ముఖ్యంగా బీహార్, అస్సామ్ కు వరద తాకిడి ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే. పకృతి విలయతాండవానికి, లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి తన వంతు సహాయం అందించేందుకు ప్రియాంకా చోప్రా ముందుకురాగా, ఆమెకు తోడుగా భర్త నిక్ జోనాస్ కూడా జత కలిశాడు.
బీహార్, అస్సామ్ ప్రభుత్వాలకు ఆర్ధిక సహాయం అందించినట్లు, జంటగా ఓ స్టేట్మెంట్ విడుదల చేసిన ప్రియాంకా నిక్, అక్కడితో చేతులు దులిపేసుకోకుండా, వీలైనంత సహాయం అందించమంటూ తమ స్నేహితులు, ఫ్యాన్స్ ను కూడా కోరారు. అధికారిక నివేదిక ప్రకారం వరదల కారణంగా అస్సామ్ లో సుమారు 22 జిల్లాలు ప్రభావితం అయ్యాయి. 22 లక్షల మంది నష్టపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరి ప్రియాంకా నిక్ ను ఆదర్శంగా తీసుకుని మరింత మంది సెలబ్రిటీలు ముందుకు వస్తారేమో చూడాలి.