Don't Miss!
- News ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
భారత దేశం గర్వించదగ్గ దర్శకుడు లైంగికంగా వేధించాడా.. ఆమెకు సెన్స్ లేదా!
గత ఏడాది మీటూ ఉద్యమం బాలీవుడ్ ని కుదిపేసింది. సీనియర్ హీరోయిన్ తనుశ్రీ దత్త ప్రముఖ నటుడు నానా పాటేకర్ పై చేసిన లైంగిక వేధింపుల సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలతోనే బాలీవుడ్ లో మీటూ ఉద్యమం మొదలైంది. తనుశ్రీ దత్తా ఇచ్చిన ధైర్యంతో చాలా మంది నటీమణులు తమకు ఎదురైన వేధింపులని వివరిస్తూ పలువురు దర్శకులు, నిర్మాతలు, నటుల పేర్లు బయట పెట్టారు. మీటూ ఉద్యమ ప్రభావంతో చాలా మంది దర్శకులు, నటులు సినిమాలు కోల్పోవలసి వచ్చింది. ఇప్పటికీ తరచుగా కొంతమంది మహిళలు బాలీవుడ్ లో లైగిక వేధింపుల గురించి ప్రస్తావిస్తున్నారు. ఇటీవల భారత దేశం గర్వించ దగ్గ దర్శకులలో ఒకరిగా భావించే రాజ్ కుమార్ హిరానీ కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు.
క్రేజీ చిత్రాలతో
రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించే చిత్రాలన్నీ ఏదో ఒక అంశాన్ని టార్గెట్ చేస్తూ అందులోని లోపాలని ఎత్తిచూపే విధంగా ఉంటాయి. చాలా నెమ్మదిగా చిత్రాలు తీసినా తన దర్శత్వంతో రాజ్ కుమార్ హిరానీ ఆడియన్స్ ని ఫిదా చేస్తుంటారు. మున్నాభాయ్ ఎంబిబిఎస్ చిత్రంలో వైద్యరంగంలో ఉన్న లోపాలని సెటైరికల్ గా చూపించాడు. 3 ఇడియట్స్ చిత్రంలో విద్యారంగంపై, పీకే చిత్రంలో మూఢ నమ్మకాలపై సెటైర్లు వేశారు. రాజ్ కుమార్ తెరకెక్కించే ప్రతి చిత్రం ఆణిముత్యంలా ఉంటుంది. అందుకే ఆయన్ని భారత దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరని పలువురు ప్రశంసిస్తుంటారు.
అసిస్టెంట్ డైరెక్టర్
ఇటీవల రాజ్ కుమార్ హిరానీ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన ఓ మహిళా దర్శకురాలు సంచలన ఆరోపణలు చేసింది. తనని రాజ్ కుమార్ సంజు చిత్ర షూటింగ్ సమయంలో లైగికంగా వేధించారని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కానీ రాజ్ కుమార్ స్టార్ డైరెక్టర్ కావడంతో ఆమె వ్యాఖ్యలపై బాలీవుడ్ ప్రముఖులు ఎవరూ మాట్లాడలేదు. తాజాగా రాజ్ కుమార్ పై వస్తున్న ఆరోపణలపై అతడి స్నేహితుడు, క్రేజీ హీరో సంజయ్ దత్ స్పందించారు.
ఏళ్ల తరబడి ట్రావెల్ చేశా
రాజ్ కుమార్ పై వస్తున్న ఆరోపణలపై సంజయ్ దత్ స్పందిస్తూ.. నేను రాజ్ కుమార్ దర్శత్వంలో పలు చిత్రాల్లో నటించా. అంటే ఆయనతో ఏళ్ల తరబడి ట్రావెల్ చేశా. రాజ్ కుమార్ ఎలాంటి వ్యక్తో నాకు పూర్తిగా తెలుసు. అసలు ఈ ఆరోపణలని నేను నమ్మను అని సంజయ్ దత్ తెలిపారు. రాజ్ కుమార్ దర్శకత్వంలో సంజయ్ దత్ మున్నాభాయ్ ఎంబిబిఎస్, లగేరహో మున్నాభాయ్, పీకే లాంటి చిత్రాల్లో నటించారు.
ఆమెకు సెన్స్ ఉందా
సంజయ్ దత్ మాట్లాడుతూ.. రాజ్ కుమార్ పై ఆరోపణలు చేసిన మహిళకు సెన్స్ ఉందా అని మండిపడ్డారు. ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలి. కానీ ఆమె అలాంటి చర్యలేవి తీసుకోవడం లేదు. దీనిని బట్టే అర్థం అవుతోంది సదరు మహిళ చేసిన కామెంట్స్ కేవలం పబ్లిసిటీ కోసమే అని సంజయ్ దత్ అన్నారు.