Don't Miss!
- News మే 10న అక్షయ తృతీయ.. ఈ రాశులపై కనక వర్షం
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
గొడవలోకి వాళ్లను లాగొద్దు, కావాలంటే క్షమాపణలు చెబుతాను!
మీటూ ఉద్యమం నేపథ్యంలో కొన్ని రోజులుగా తనుశ్రీ దత్తా, రాఖీ సావంత్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు నానా పాటేకర్ మీద తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో రంగంలోకి దిగిన రాఖీ సావంత్.... ఆమెపై విరుచుకుపడ్డారు. తనుశ్రీ 'ఫేక్ మీటూ ఆరోపణలు చేస్తోంది' అంటూ ఎదురు దాడికి దిగడంతో వీరి మధ్య గొడవ మరింత పెద్దదైంది.
కాగా... తాజాగా తనుశ్రీ దత్తాకు క్షమాపణలు చెబుతూ రాఖీ సావంత్ ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్టు చేయడం హాట్ టాపిక్ అయింది. నిన్నటి వరకు ఆమెపై తీవ్ర ఆరోపణలు చేసిన రాఖీ ఎందుకు క్షమాపణలు చెప్పిందో... ఓ లుక్కేద్దాం.
తనుశ్రీ ఓపెన్ లెటర్, స్పందించిన రాఖీ
లెస్బియన్ అంటూ రాఖీ సావంత్ తన మీద తీవ్ర ఆరోపణలు చేయడంతో.... తనుశ్రీ దత్తా ఓపెన్ లెటర్ సంధించారు. నాకు జీసెస్ మీద నమ్మకం పోయిందని, రాఖీ సావంత్ క్షమాపణలు చెప్పే వరకు చర్చిలో అడుగు పెట్టను అంటూ అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాఖీ సావంత్ స్పందించారు.
|
మన గొడవలోకి వారిని లాగొద్దు
గొడవ మన మధ్య జరుగుతోంది. ఇందులోకి అనవసరంగా దేవుడిని లాగొద్దు. నీవు దేవుడి మీద నమ్మకం కోల్పోవాల్సిన అసవరం లేదు. కావాలంటే నేను నీకు క్షమాపణలు చెబుతాను. నవ్వు చర్చికి వెళ్లి, మసీద్ వెళ్లు, మందిర్ వెళ్లు అంటూ తనదైన శైలిలో రాఖీ సావంత్ వ్యాఖ్యానించారు.
తను శ్రీ దత్తా మీద గతంలో రాఖీ తీవ్ర ఆరోపణలు
తనుశ్రీ దత్తా ఒక లెస్బియన్ అని, నాతో స్వలింగ సంపర్కంలో పాల్గొందని, నాతో పాటు చాలా మందిని ఆమె రేప్ చేసిందంటూ... ఇటీవల రాఖీ సావంత్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన వద్ద ఆధారాలు సైతం ఉన్నాయని రాఖీ పేర్కొన్నారు.
తీవ్ర మనస్తాపంలో తనుశ్రీ
రాఖీ సావంత్ నుంచి ఇలాంటి దాడి ఎదరవుతుందని ఊహించని తనుశ్రీ దత్తా తీవ్రమనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో దేవుడిపై తనకు నమ్మకం పోయిందని, రాఖీ నుంచి క్షమాపణలు వచ్చే వరకు చర్చి మెట్లు ఎక్కను అంటూ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.