ఆమె 10 కోట్లు.. ఈమె పావలా.. శృంగార తార చర్యలు ఊహాతీతం!
బాలీవుడ్ లో మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. కానీ తనుశ్రీ దత్త, శృంగార తార రాఖి సావంత్ మధ్య వివాదం పక్కదారి పడుతోంది. వీరిద్దరూ వ్యక్తిగతంగా బద్ద శత్రువులుగా మారుతున్నారు. ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలకు దిగుతున్నారు. తనుశ్రీ దత్త నానా పాటేకర్ పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని రాఖీ సావంత్ విమర్శించింది. ఆమె లెస్బియన్ అని, తనని రేప్ చేసిందని, డ్రగ్స్ అలవాటు కూడా ఆమెకు ఉందంటూ రాఖీ సావంత్ హద్దులు దాటిన విమర్శలతో చెలరేగిపోయింది. దీనితో తనుశ్రీ దత్త రాఖీ సావంత్ పై 10 కోట్ల పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

చర్యలు ఊహాతీతం
రాఖీ సావంత్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరికీ అర్థం కాదు. తనుశ్రీ తనపై వేసిన పరువు నష్టం దావాపై రాఖీ స్పందించిన తీరు ఆశ్చర్యకరంగా ఉంది. తిరిగి రాఖీ కూడా తనుశ్రీ పై పరువునష్టం దావా వేయడం ఆసక్తిగా మారింది.

పావలా పరువు నష్టం
తనుశ్రీ రాఖీపై 10 కోట్లకు పరువునష్టం దావా వేసింది. కానీ రాఖి సావంత్ మాత్రం కేవలం పావలా(25 పైసలు)తో పరువు నష్టం దావా వేయడం హాస్యాస్పదంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాఖీ సావంత్ విలువ కేవలం పావలా మాత్రమేనా అందుతూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పార్టీలకు తీసుకుని వెళ్లి
తనుశ్రీ దత్త తనని పార్టీలకు తీసుకుని వెళ్లి రేప్ చేసిందని, ఆమెలో పురుష లక్షణాలు ఉన్నాయంటూ రాఖీ సావంత్ వ్యాఖ్యానించింది. ఆమె మాదక ద్రవ్యాల వ్యసనపరురాలు అంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దీనితో రాఖీ సావంత్ పై తనుశ్రీ పరువునష్టం దావా వేసింది.

తనుశ్రీ కూడా
అదే సమయంలో తనుశ్రీ కూడా రాఖీపై ఘాటు వ్యాఖ్యలే చేసింది. తనుశ్రీ దత్తకు శృంగారం, డబ్బు పిచ్చి పట్టి ఉందని, అందుకే ఇలా మాట్లాడుతోందంటూ వ్యాఖ్యానించింది. నా తల్లిందండ్రులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులని ఎంచుకోమని తెలిపారు. అందుకే నా జీవితంలో రాఖీ సావంత్ లాంటి వారిని దగ్గరకు రానీయను అంటూ వ్యాఖ్యానించింది.

నా ప్రతిష్ట దెబ్బ తీసేలా
తనుశ్రీ దత్తని రాఖీ సావంత్ ఆ మధ్యన ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించింది. కానీ ఇప్పుడు తనుశ్రీ అన్న మాటలకు తన ప్రతిష్ట దెబ్బతింటోందని అందుకే పావలా పరువునష్టం దావా వేస్తున్నాని రాఖీ సావంత్ వ్యాఖ్యానించింది.


Click it and Unblock the Notifications











