ఆ కోరిక తీరట్లేదు..రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరితో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రస్తుతం తెలుగులో సినిమాలు కరువైన సంగతి తెలిసిందే. ఎక్కువగా హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టిన ఈ భామ కూడా ముంబైకి మార్చేసింది. సెల్వరాఘవన్ 7జి బృందావన్ కాలనీ కన్నడ రీమేక్ తో ఈ భామ ఇండస్ట్రీకి పరిచయం అయింది. తెలుగులో కెరటం అనే సినిమాతో ఆమె పరిచయం అయింది. తమిళంలో దానినే యువన్ అనే పేరుతో రిలీజ్ చేశారు.
ఆ తర్వాత మరో రెండు తమిళ సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. వెంకటాద్రి ఎక్స్ప్ ప్రెస్ అనే సినిమాలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో ఆయనకు విశేష ఆదరణ లభించింది. ఆ తరువాత అనేక మంది స్టార్ హీరోలతో నటించి తెలుగులో ఆమె స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అయితే అనూహ్యంగా ఆమె నాగార్జున సరసన మన్మధుడు సీక్వెల్ సినిమాలో నటించడంతో ఆ సినిమా తర్వాత ఆమె తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆమె బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది.. బాలీవుడ్ లో కొన్ని అవకాశాలు రావడంతో అక్కడ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో బిజీ బిజీగా ఉంది.

అయితే బాలీవుడ్ లో తనకు ఆ కోరిక తీరలేదు అని ఆమె చెప్పుకొచ్చింది. రకుల్ తను ఒక సాధారణ (నాచ్-గానా) పాట - డ్యాన్స్ ఉన్న సినిమాలో నటించాలని అనుకున్నా కుదరలేదని చెప్పుకొచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ఇతర సినిమాలతో పాటుగా అలాంటి ఒక సినిమా చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. అది టాలీవుడ్ లో కుదరలేదని, బాలీవుడ్ లో కూడా కుదరలేదని చెప్పుకొచ్చింది. ఇక రకుల్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కొండపొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











