Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
రణబీర్ కపూర్ పై కోర్టులో పిటీషన్ వేసిన మహిళ.. అపార్ట్ మెంట్ నుంచి గెంటేసిన వైనం!
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ పై కోర్టులో పిటీషన్ దాఖలైంది. సూర్య వంశీ అనే మహిళ రణబీర్ కపూర్ పై ఈ పిటీషన్ వేయడం ఆసక్తిగా మారింది. పుణెలోని రణబీర్ కపూర్ కు చెందిన ఓ పార్ట్ మెంట్ లో సూర్యవంశీ అనే మహిళ కుటుంబం నివాసం ఉంటోంది. ముందుగా కుదుర్చుకున్న అగ్రిమెంట్ ఒప్పందాన్ని ఉలంఘించాడని ఆరోపించింది.
గడువు ముగియక ముందే అపార్ట్ మెంట్ నుంచి బలవంతంగా గెంటేశారని ఆరోపిస్తూ 50 లక్షలు పిటిషన్ వేశారు. బలవంతంగా ఖాళీ చేయించడం వలన ఇబ్బందులు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు.
2016 లో సూర్యవంశీకి రణబీర్ తన అపార్ట్ మెంట్ ని నెలకు 4 లక్షల అద్దెకు 24 నెలల కాలానికి ఇచ్చాడు. కానీ 11 నెలలకే బలవంతంగా ఖాళీచేయించారని సూర్యవంశీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రణబీర్ నోటీసులు అందుకున్నాడు. రణబీర్ స్పందిస్తూ సూర్యవంశీ ఇష్టపూర్వకంగానే అపార్ట్ మెంట్ ఖాళీ చేశారని పేర్కొన్నాడు. కోర్టులో తమ వాదనని వినిపిస్తామని స్పష్టం చేశాడు.