దీపిక పదుకోన్తోపాటు రణ్వీర్ సింగ్ కూడా డ్రగ్స్ కేసు విచారణకు.. అసలేం జరిగిందంటే!
బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్కు సమన్లు జారీ చేయడం దేశ సినీ పరిశ్రమను కుదిపేసింది. దీపికనే కాకుండా టాప్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్, సారా ఆలీ ఖాన్, శ్రద్దా కపూర్ను కూడా విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపిక ఎన్సీబీ విచారణకు హాజరయ్యేందుకు సిద్దమవుతున్నారు. అయితే రణ్వీర్ సింగ్ కూడాఆమెతోపాటు విచారణకు హాజరవుతున్నారనే విషయం హాట్ టాపిక్గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

గోవా షూటింగ్ నుంచి ముంబైకి
డ్రగ్స్ కేసులో సమన్లు జారీ చేసే సమయానికి దీపిక పదుకోన్ గోవాలో ఉన్నారు. శకున్ బాత్రా దర్శకత్వంలో అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేదితో కలిసి నటిస్తున్న చిత్రం కోసం షూటింగులో పాల్గొంటున్నారు. సమన్లు జారీ కావడంతో షూటింగ్ను తాత్కాలికంగా వాయిదా వేసి ముంబైకి ప్రయాణం అయ్యారు.
Recommended Video

దీపికతో విచారణకు అనుమతించండి
సెప్టెంబర్ 26వ తేదీన దీపిక పదుకోన్ విచారణకు హాజరవుతున్న క్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు ఓ విన్నపం చేసుకొన్నారు. దీపిక వెంట తాను కూడా విచారణకు వస్తాను. అనుమతి ఇవ్వాలి అని తన అభ్యర్థన పత్రంలో వేడుకొన్నారు. దీపిక మానసిక ఆరోగ్యం సరిగాలేదు. గతంలో డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలతో బాధపడ్డారు. ఆమె ఇప్పటికీ కూడా వాటి నుంచి కోలుకోలేదు. కాబట్టి ఆమె పక్కన ఉండటం ఈ పరిస్థితుల్లో తప్పనిసరి అని రణ్వీర్ సింగ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











