Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
అక్కడ దక్కలేదు, ఇక్కడ నా సొంతమైంది: రణవీర్ సింగ్ ఎమోషనల్ స్పీచ్, ఏడ్చేసిన దీపిక!
Recommended Video
బాలీవుడ్ ప్రేమ జంట రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ నవంబర్ 14, 15 తేదీల్లో ఇటలీలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్లో ఏకమైన సంగతి తెలిసిందే. కొంకణి, సింధి రెండు సాంప్రదాయాల్లో ఘనంగా వీరి వివాహ వేడుక జరిగింది. పెళ్లి తర్వాత బెంగుళూరు, ముంబైలో గ్రాండ రిసెప్షన్స్ నిర్వహించారు.
మూడు ముళ్లు పడ్డ తర్వాత వీరి మధ్య ఉన్న ప్రేమ బంధం మరింత బలపడినట్లు స్పష్టమవుతోంది. ఆదివారం రాత్రి జరిగిన 'స్టార్ స్క్రీన్ అవార్డ్స్ 2018' వేడుక ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. రణవీర్ సింగ్ 'పద్మావత్' చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకుంటుంటే.... దీపిక పదుకోన్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.
ఇక్కడ నా సొంతమైంది అంటూ రణవీర్ సింగ్ ఎమోషనల్ స్పీచ్
‘‘పద్మావత్ సినిమాలో నేను రాణిని దక్కించుకోలేదు. కానీ నిజ జీవితంలో దక్కించుకున్నాను. బేబీ(దీపిక) ఐలవ్ యూ.. గత ఆరేళ్లలో నేను ఏదైనా సాధించానో అదంతా నీ సపోర్ట్ వల్లే సాధ్యమైంది.'' అని రణవీర్ సింగ్ ఎమోషనల్గా స్పందించారు.
మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న రణవీర్
పెళ్లి తర్వాత రణవీర్ సింగ్ తన మ్యారీడ్ లైఫ్ మరింత ఎంజాయ్ చేస్తున్నాడు. ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాడు. తన జీవితంలో చేసిన అతి గొప్ప పని దీపికను పెళ్లాడటమే అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
ఆరేళ్లుగా డేటింగ్
దీపిక, రణవీర్ ఆరేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ‘రామ్-లీలా' సినిమాలో కలిసి నటించిన తర్వాత వీరి ప్రేమబంధం మరింత బలపడింది. అప్పటి నుంచి ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమను మరింత పెంచుకుంటూ తమ లవ్ జర్నీ సాగించారు.
రణవీర్ సంగ్
రణవీర్ సింగ్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో నటించిన ‘సింబా' మూవీకి సంబంధించిన ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తర్వాత రణవీర్, దీపిక హనిమూన్ వెళ్లే అవకాశం ఉంది.
దీపిక పదుకోన్
దీపిక పదుకోన్ త్వరలో మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో నటించబోతోంది. యాసిడ్ ఎటాక్కు గురైన లక్ష్మి అగర్వాల్ జీవితంగా ఆధారంగా ఈ సినిమా ఉండబోతోంది. ఈ చిత్రం ద్వారా దీపిక నిర్మాతగా మారుతుండటం విశేషం.