Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘రేసుగుర్రం’ విలన్ కూతురు హీరోయిన్గా ఎంట్రీ
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ' రేసు గుర్రం' చిత్రంలో మద్దాలి శివారెడ్డి అనే విలన్ పాత్రలో భోజ్పురి నటుడు రవి కిషన్ పెర్ఫార్మెన్స్ ఆ సినిమాకే హైలెట్ అయింది. ఆ తర్వాత రవి కిషన్ పలు దక్షిణాది చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్లారు.
కాగా.. రవికిషన్ కూతురు రివ త్వరలో సినీ పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం కాబోతోంది. బాలీవుడ్ చిత్రం ద్వారా ఆమె తన సినిమా కెరీర్ మొదలు పెట్టబోతున్నారు. రివ నటించబోయే తొలి సినిమా వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.
బాలీవుడ్ నటి పద్మినీ కోల్హాపురి కుమారుడు ప్రియాంక్ను హీరోగా పరిచయం చేస్తూ త్వరలో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో ప్రియాంక్ సరసన రివ నటించబోతోంది. ఈ చిత్రానికి కరణ్ కశ్యప్ దర్శకత్వం వహించబోతున్నారు.
తన కూతురు రివ తెరంగ్రేటంపై రవి కిషన్ మాట్లాడుతూ... మంచి స్క్రిప్టు దొరికింది. ఇలాంటి కథ దొరకడం ఊహించని బహుమతి. రెండు వారాలుగా ప్రియాంక్, రివ వర్క్ షాపుకు అటెండ్ అవుతున్నారు. నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారనే నమ్మకం ఉంది అన్నారు.