Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాఖీతో ఆరతి పళ్లెం సిద్ధంగా... కానీ కన్నా నువ్వెక్కడ? కన్నీరు తప్పిస్తున్న సుశాంత్ సోదరి పోస్ట్
సుశాంత్ సింగ్ రాజ్ పుత్, లోకాన్ని విడిచి నెలలు గడుస్తున్నాయి, అతడి మరణం మిస్టరీగా మారిన నేపథ్యంలో కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్ని పరిణామాలు చోటుచేసుకున్నా, అతడి కుటుంబంలో ఏర్పడిన లోటు మాత్రం ఎవరు పూడ్చలేనిది. ఆ ఇంటికి వెలుగు దివ్వె అయిన సుశాంత్, అక్కల కంటికి ఆశాకిరణంగా పెరిగాడు. తమ చిటికెన వేలు పట్టుకుని పెరిగిన ఆ చిన్ని కన్నయ్య ఈ లోకంలో లేడన్న వార్త జీర్ణించుకోలేకపోతున్న ఆ సోదరీమణి... రక్షాబంధన్ పురస్కరించుకుని ప్రయమైన తమ్ముడికి ఓ కన్నీటి అక్షరధార విడిచింది.
Recommended Video
"నా కన్నా.. ఇది నా రోజు, నీ రోజు.. మనిద్దరి రోజు. ఎందుకంటే ఈ రోజు రాఖీ పండుగ. 35 ఏళ్ల తరువాత కూడా ఆరతి పళ్లెం నీ కోసం ముస్తాబయింది. పసుపు, గంథం మిళితమైన బొట్టు సిద్ధంగా ఉంది. నీ కిష్టమైన మిఠాయి కూడా ఉంది. కానీ, ఆరతి ఇచ్చేందుకు ఆ అందమైన ముఖమే లేదు. బొట్టుపెట్టేందు విశాలమైన నుదురు లేదు, రాఖీ కట్టేందుకు ఆ చేతులు కనిపించడంలేదు. మిఠాయి తినిపించేందుకు ఆ పెదాలు లేవు, నుదుటిపై ముద్దుపెట్టుకునేందుకు ఆ వదనమూ లేదు.
కౌగిలించుకునేందుకు తమ్ముడూ లేడు. కొన్నేళ్ల క్రితం నీవు మా జీవితాల్లోకి వచ్చినప్పుడు, నా లోకంలో కొత్త కాంతులు విరజిమ్మాయి. నువ్వే మా కంటి దీపమయ్యావు. కానీ, ఇప్పుడు నువ్వు లేని ఈ లోకంలో ఏం చేయాలో నాకు అర్ధం కావడంలేదు. నీవు లేకుండా జీవించడం నాకు అలవాటు లేదు. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదే. ఈ రోజు అన్నీ అలానే ఉన్నాయి,కానీ నువ్వు మాత్రమే లేవు. అన్నీ కలసి నేర్చుకున్నామే... మరి నువ్వు లేకుండా జీవిచండం నేనొక్కద్దానే ఎలా నేర్చుకోను?" - నీ రాణీ అక్క...
కన్నీటి ధారలు ఆగకుండా కురుస్తుండగా మనసులోని వేదనంతా అక్షరమాలలుగా మారిన వేళ సుశాంత్ సోదరి లేఖ... చదివిన వారికి కంట కన్నీరు తెప్పించక మానదు. మరోవైపు సుశాంత్ మరో సోదరి శ్వేతా సింగ్ తమ తమ్మడి మరణం వెనుక దాగున్న నిజాలను వెలికి తీయాల్సిందిగా ప్రధాని మోదీకి సోషల్ మీడియా ద్వారా విన్నవించుకున్నారు.
"నా మనసు చెబుతోంది మీరు నిజానికి బాసటగా నిలుస్తారని, మాది సాధారణ కుటుంబం, మా తమ్ముడికి గానీ, మాకు గానీ బాలీవుడ్ లో ఎలాంటి గాడ్ ఫాదర్ లేరు. మీరు ఈ కేసుపై దృష్టిసారించి, సాక్ష్యాలు తారుమారు అవ్వకుండా, సమగ్ర విచారణ జరిగేలా చూడాలని అభ్యర్ధిస్తున్నాను, మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను" అంటూ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం పోలీసు విచారణలో ఉన్న సుశాంత్ కేసు, సీబీఐకు అప్పగించాల్సిందిగా అన్ని వైపుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.