Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వేశ్యలని వాళ్ళతో పోల్చుతావా.. మండిపడ్డ సీనియర్ హీరోయిన్!
ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ సతీమణి, నటి అయిన సుచిత్ర కృష్ణమూర్తి చేసిన ఓ ట్వీట్ వివాదభరితంగా మారింది. వేశ్యలని ఉద్దేశించిన సుచిత్ర చేసిన వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహాన్ని తెలిప్పిస్తున్నాయి. సుచిత్ర వ్యాఖ్యలపై సీనియర్ నటి రేణుక సహానే కూడా మండిపడింది. రేణుక సహానే 90వ దశకంలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగులో రేణుక మనీ మనీ చిత్రంలో నటించింది. రేణుక వ్యాఖ్యలతో సుచిత్ర చివరకు తన తప్పు అంగీకరించింది. ఆ వివాదం ఏంటో ఇప్పుడు చూద్దాం!
మా అమ్మ చెప్పింది
సుచిత్ర సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా తన అభిప్రాయాలని అభిమానులతో పంచుకుంటుంది. గతంలో తన తల్లి చెప్పిన ఓ విషయాన్ని గుర్తు చేసుకుంటూ సుచిత్ర ట్వీట్ చేసింది. మా అమ్మ చాలా కరెక్ట్ గా చెప్పింది. జీవితంలో డబ్బే సర్వసం కాదు. ఆ విషయం నాకు ఇప్పుడు భోదపడుతోంది. వ్యక్తిత్వం ముఖ్యం. ఇలాంటి విషయాలని మా అమ్మ నా చిన్నతనంలో చెప్పేది అని సుచిత్ర తెలిపింది.
వేశ్యలని వాళ్ళతో పోల్చుతూ
జీవితంలో డబ్బు ప్రధానం కాదు. ఎందుకంటే డబ్బు నేరస్థుల దగ్గర, వేశ్యల దగ్గర కూడా ఉంటుంది. మా అమ్మ మాటల్లో నిజాన్ని ఇప్పుడు గ్రహిస్తున్నా అని సుచిత్ర పేర్కొంది. సుచిత్ర ట్వీట్ పై కొందరు నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. వేశ్యలని, నేరస్తుల్ని ఒక్కటి చేసి మాట్లాడవద్దని సుచిత్రకు సూచిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రేణుక సహానే వేశ్యలకు, నేరస్థులకు మధ్య తేడాని వివరించి చెప్పారు.
అలా మాట్లాడడం సరికాదు
నేను మీ తల్లిని గౌరవిస్తాను. కానీ వేశ్యలని, నేరస్తుల్ని పోల్చడం సరికాదు. వేశ్యలు తమని తాము అమ్ముకుంటారు. కానీ నేరస్థులు ఇతరులని దోచుకుంటారు. వీరి మధ్య చాలా తేడా ఉంది అని రేణుక తెలిపింది. నిస్సహాయ పరిస్థితులలో కొందరు వేశ్యలుగా మారుతుంటారు. మన సమాజంలో వేశ్యలని వెలివేసి చూస్తాం. కానీ నేరస్థులకు మనం పార్లమెంట్ లో కూడా స్థానం కల్పిస్తున్నాం అని రేణుక తెలిపింది.
తప్పు ఒప్పుకుని
రేణుక వ్యాఖ్యలతో సుచిత్ర తన తప్పుని అంగీకరించారు. తాను ఈ వ్యాఖ్యలని ఎవరినో ఉద్దేశించి చేయలేదని సుచిత్ర తెలిపారు. రేణుక పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రేణుక తరచుగా వెండితెరపై మెరుస్తోంది. ఆమె బుల్లితెర నటిగా కూడా రాణించింది.