Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సుశాంత్ సింగ్, దిశా మరణాల వెనుక ఒకే కారణం.. డబుల్ మర్డర్.. సీక్రెట్గా టీవీ చానెల్ ఇన్వెస్టిగేట్
సుశాంత్ మృతి వెనుక అసలు కారణం ఏమిటనే విషయంలో అనేక రకాల అనుమానాలు రగులుతున్న విషయం తెలిసిందే. సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు, పోస్టుమార్టంలో కూడా అదే తేలింది. కానీ చాలా మంది ఈ కేసు విచారణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మొదటి నుంచి కూడా ప్రముఖ రిపబ్లిక్ న్యూస్ ఛానెల్ లో ఇది ముమ్మాటిగా హత్య అంటూ..ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నప్పటికి ఏవరో ఒకరి కారణంగానే ప్రాణాలు తీసుకొని ఉంటారని చెబుతున్నారు.
బాలీవుడ్ తారాలపై కామెంట్స్
రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి సుశాంత్ సూసైడ్ పై రెగ్యులర్ గా డిబేట్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయన బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీస్ పై నెపోటిజమ్ కామెంట్స్ చేశారు. ఇక సల్మాన్ ఖాన్, మహేష్ భట్, కరణ్ జోహార్ వంటి వారిపై కూడా అర్నాబ్ చేసిన కామెంట్స్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే.
రిపబ్లిక్ టీవీ సీక్రెట్ ఇన్వెస్టిగేట్
ఇక రిపబ్లిక్ టీవీ ఈ కేసు విషయంలో మొదటి నుంచి సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఒక టీమ్ గా ఏర్పడి సుశాంత్ సింగ్ తో మొదటి నుంచి పని చేసిన టెక్నీషియన్స్ ని అలాగే నటీనటులను రిపబ్లిక్ టివి సభ్యులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అలాగే రియా చక్రవర్తి సైడ్ నుంచి కూడా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
మర్డర్ కారణంగానే మరొక హత్య
అయితే వారు నిర్వహించిన ఆపరేషన్ లో ఒక విషయం మాత్రం క్లియట్ గా అర్థమైనట్లు చెప్పారు. సుశాంత్ సింగ్, అతని మాజీ మేనేజర్ దిశా మరణాలకు చాలా దగ్గరి సంబంధం ఉందని చెబుతున్నారు. ఒక మర్డర్ కారణంగానే మరొక హత్య జరిగిందని ఇదొక డబుల్ మర్డర్ అని అన్నారు.
పక్కా ప్లాన్ ప్రకారం హత్య..
దిశా మరణానికి ముందే సుశాంత్ కి ఒక రహస్యాన్ని చెప్పిందని పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయిన ఆ విషయాన్ని ఎలాగైనా మీడియా ముందు ఉంచాలని సుశాంత్ అనుకున్నాడట. అయితే ఆ విషయాన్ని మాయం చేయాలని పక్కా ప్లాన్ ప్రకారం దిశా మరణం తరువాత సుశాంత్ ని హత్య చేసినట్లు రిపబ్లిక్ టివి చెబుతోంది.
Recommended Video
టీవీ చానెల్ ఇన్వెస్టిగేషన్
అదే విధంగా సుశాంత్ సింగ్, దిశా మరణాలకు ముందు పార్టీలు జారిగాయని సమాచారాలు ఉన్నాయని అయితే వారు మృతి చెందిన వారం రోజుల ముందు వరకు కూడా ఎలాంటి పార్టీలు జరగలేదట. పోలీసులు ఈ విషయాన్ని చెబుతుండడం చూస్తుంటే ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని రిపబ్లిక్ టీవీ ఆరోపించింది. మొత్తంగా ఒక స్ట్రాంగ్ టీమ్ నేతృత్వంలో ఈ రెండు హత్యలకు సంబంధించి తీవ్ర స్టయిలో రిపబ్లిక్ టీవీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.