Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి ఊరట.. మూడు నెలల తర్వాత పూర్తి ఉపశమనం
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో అరెస్టైన రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తికి బెయిల్ లభించింది. మూడు నెలల తర్వాత ఆయనకు బెయిల్ లభించడంతో రియా చక్రవర్తికి ఊరట లభించింది.
ఈ ఏడాది సెప్టెంబర్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు షోవిక్ చక్రవర్తిని, రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రియా చక్రవర్తి నెల రోజుల తర్వాత బెయిల్పై బయటకు రాగా, షోవిక్ చక్రవర్తి డిసెంబర్ 2వ తేదీన బెయిల్పై విడుదల అయ్యారు.
డ్రగ్స్ కేసులో ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు న్యాయమూర్తి జీబీ గురావు బుధవారం తీర్పు వెల్లడిస్తూ.. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. నేరం ఒప్పుకోవడం అనేది సాక్ష్యం కిందికి రాదంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు అనుసరించి షోవిక్కు బెయిల్ మంజూరు చేశారు.
అరెస్ట్కు ముందు రియా చక్రవర్తి, షోవిక్పై ఎన్సీబీ తీవ్ర ఆరోపణలు చేసింది. పేమెంట్ గేట్వేస్, క్యాష్, క్రెడిట్ కార్డుల ఉపయోగించి డ్రగ్స్ను సుశాంత్ సింగ్కు షోవిక్ ద్వారా సరఫరా రియా చేసిందనే ఆరోపణలు చేయడం సంచలనం రేపింది.