Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
బ్రేకింగ్: రియా చక్రవర్తికి ఎదురుదెబ్బ.. డ్రగ్ కేసులో షోవిక్ చక్రవర్తి అరెస్ట్
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో భాగంగా దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శుక్రవారం రాత్రి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని, మేనేజర్ శ్యామ్యూల్ మిరాండాను అరెస్ట్ చేయడం బాలీవుడ్లో కలకలం రేపింది. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై షోవిక్, మిరాండాను అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఈ అరెస్ట్ గురించి వివరాల్లోకి వెళితే
డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్టు
డ్రగ్ మాఫియాతో సంబంధమున్న ముగ్గురిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో శుక్రవారం ఉదయమే శ్యామ్యూల్ మిరాండా, షోవిక్ చక్రవర్తి, రియా చక్రవర్తి నివాసాలపై మెరుపుదాడులు చేశారు. వాస్తవానికి షోవిక్ తన సొంత పట్టణానికి వెళ్లాల్సి ఉంది. అయితే ఆయనను తన సొంత పట్టణానికి వెళ్లకుండా అధికారులు నిరోధించారు.
షోవిక్ను కొద్దిరోజులు వరుసగా ప్రశ్నించిన ఎన్సీబీ
డ్రగ్స్ సప్లయిదార్లతో సంబంధాలున్నాయనే విషయాన్ని ధృవీకరించుకొన్న ఎన్సీబీ అధికారులు కొద్దిరోజులుగా షోవిక్, రియా, మిరాండాను విచారిస్తున్నారు. అయితే డ్రగ్స్ సప్లయిదారులు చెప్పిన విషయాలు, షోవిక్ చెప్పిన విషయాల మధ్య పొంతన కుదరకపోవడంతో మిరాండాతో కలిపి శుక్రవారం మళ్లీ విచారించారు.
అరెస్ట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత
బాలీవుడ్లో డ్రగ్స్ కేసులో షోవిక్ చక్రవర్తి, శ్యామ్యూల్ మిరాండాను అరెస్ట్ చేయాలని నిర్ణయించుకొని కస్టడీలోకి తీసుకొన్నారు. ముంబైలో ప్రస్తుతం వారి అరెస్ట్కు సంబంధించిన ప్రక్రియ జరుగుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. వీరి అరెస్ట్ గురించి నార్కోటిక్స్ అధికారులు ప్రకటన చేసే అవకాశం ఉంది.
Recommended Video
శనివారం ఉదయం కోర్టులో హాజరు
డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన షోవిక్ చక్రవర్తి, శ్యామ్యూల్ మిరాండాను శనివారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇప్పటికే ముగ్గురు డ్రగ్స్ సప్లయిర్లను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వారిని సెప్టెంబర్ 9వ తేదీ వరకు కస్టడీలో ఉంచుకోనున్నట్టు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు.