Don't Miss!
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
రియా భారీ ఖర్చులు.. సంజయ్, సల్మాన్ కేసులను డీల్ చేసిన లాయర్ని పెట్టుకోవడానికి కారణం?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన అనేక వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా రియా చక్రవర్తి మరోసారి విచారణకు సంబంధించిన కారణాల వల్ల బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. సుశాంత్ సింగ్ మృతులకు కారణమైన వారిలో రియా పాత్ర ఉందంటూ సుశాంత్ తండ్రి కేకే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే మొత్తంగా ఈ కేసు నుంచి బయటపడడానికి రియా చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
దేశంలోనే టాప్ మోస్ట్ క్రిమినల్ లాయర్
ముందుగా రియా దేశంలోనే టాప్ మోస్ట్ క్రిమినల్ లాయర్ ని సంప్రదించడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన పేరు సతీష్ మనేషిండే. గత 25 ఏళ్ళ నుంచి అత్యంత క్లిష్టమైన కేసులను ఆయన వాదించారు. ముఖ్యంగా సంజయ్ దత్ 1993లో బాంబ్ బ్లాస్ట్ లో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కోగా అప్పుడు సతీష్ సంజయ్ తరపున వాదించారు.
సల్మాన్ ని సేవ్ చేసింది ఆయనే..
అదే విధంగా మరో స్టార్ హిరో సల్మాన్ ఖాన్ జింకను వేటాడిన కేసులో ఇబ్బందులు ఎదుర్కోగా అప్పుడు కూడా సతీష్ కోర్టులో సల్మాన్ తరపున వాదించి చాలా వరకు సేవ్ చేశారు. అంతే కాకుండా దేశంలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తల వివాదాలకు సంబంధించిన కేసులలో కూడా లాయర్ సతీష్ చాలా తెలివిగా ఆలోచించి గెలిచారు.
రియాకు అంత డబ్బు ఎక్కడిది
అయితే అలాంటి టాప్ మోస్ట్ లాయర్ ని రియా కలవడం ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. ఆయనకి ఫీజు ఇచ్చి కేసును నడిపించడం అంటే చాలా ఖర్చులతో కొడుకున్న వ్యవహారమనే కథనాలు కూడా వస్తున్నాయి. దీంతో రియాకు అంత డబ్బు ఎక్కడిది అనేలా కూడా కామెంట్స్ వస్తున్నాయి.
రియా 15కోట్లు తీసుకుందా?
ఆమె సినిమా ఇండస్ట్రీలో అవకాశాల ద్వారా సంపాదించింది పెద్దగా ఏమి లేదు. ఈ కేసులో తన తప్పు లేదని చెబుతున్నప్పటికీ ఆమె అంతగా ఎందుకు భయపడుతోంది అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే సుశాంత్ నుంచి దాదాపు 15కోట్ల వరకు రియా తీసుకున్నట్లు కేకే.సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే.
Recommended Video
ఈ కేసు నుంచి ఎలా బయటపడుతుందో?
ఆఖరికి క్రెడిట్ కార్డ్ కూడా వదలలేదని FIR లో నమోదు చేశారు. ఇక ఓ వైపు ముంబై పోలీసులు మరోవైపు బీహార్ పోలీసులు ఇరువైపులా ఆమెను విచారణ జరుపుతుండడం కొంత అసహనానికి గురి చేస్తోంది. అందుకే రియా టాప్ మోస్ట్ క్రిమినల్ లాయర్ సతీష్ మనేషిండేను కలిసినట్లు తెలుస్తోంది. మరి రియా ఈ కేసు నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.