Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
సుశాంత్ కేసును సిబీఐకి అప్పగించండి.. అమిత్ షాకు చేతులెత్తి మొక్కిన రియా
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి (జూన్ 14) నెలరోజులు దాటిపోయింది. సుశాంత్ చనిపోయి నెలరోజులు అయిన సందర్భంగా ప్రేయసి రియా చక్రవర్తి సోషల్ మీడియాలో ఎమోషనల్ అయింది. అయితే రియా ఒకటి అనుకుని చేస్తే మరోకటి అయింది. రియాను నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. మొసలి కన్నీరు అంటూ రియాను విపరీతంగా ట్రోల్ చేశారు. ఇక నెటిజన్ల దెబ్బకు తట్టుకోలేకనో ఏమో గానీ రియా అమిత్ షాకు ఓ ట్వీట్ చేసింది.
Recommended Video
నెలరోజులైన సందర్భంగా..
సుశాంత్ సింగ్ మరణించి నెల రోజులు అయిన సందర్భంగా మాజీ ప్రేయసి రియా చక్రవర్తి ఎమోషనల్ అయింది. ‘నీవు లేవనే బాధ, ఆ భావోద్వేగాలోంచి బయటపడటానికి ఇంకా కష్టపడుతున్నాను .. నా హృదయం మొత్తం మూగబోయింది. ప్రేమను, దాని శక్తిని విశ్వసించేలా చేసిన వ్యక్తివి నువ్వు. నిన్ను కోల్పోయి 30 రోజులు అవుతుంది కానీ నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ తెగ ఎమోషనల్ అయింది.
రియాపై విపరీతమైన ట్రోలింగ్..
ఇక రియా చేసిన పోస్ట్ను చూసిన నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. సుశాంత్ కేసుకు సంబంధించి సీబీఐ ఎంక్వైరీ వేయాలని ఒక్కసారి కూడా డిమాండ్ చేయలేదని, ఇప్పుడు మాత్రం గుర్తుకు వచ్చాడా? ఇన్ని రోజులు ఏమైందని నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. మొసలి కన్నీరు కార్చొద్దని ఓ రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేప్ చేస్తాం..
తాజాగా సోషల్ మీడియాలో రియాకు బెదిరింపులు కూడా వచ్చాయట. రేప్ చేస్తాం. చంపేస్తాం.. లేదా ఆత్మహత్య చేసుకో అంటూ రియాను బెదిరించారట. వీటిపై రియా స్పందిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ కాస్త ఎమోషనల్ అయింది. ఇక కాసేటికే రియా మరో ట్వీట్ చేస్తూ అమిత్ షాను వేడుకుంది.
సుశాంత్ ప్రేయసిని నేను..
సుశాంత్ కేసులో సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని రియా కోరుతూ ఓ ట్వీట్ చేసింది. ఈ మేరకు ‘గౌరవనీయులైన అమిత్ షా సర్కు.. నేను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ను.. ఆయన చనిపోయి నెల అవుతోంది.. నాకు ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంది.. న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది..
కారణం తెలియాలి..
మీకు రెండు చేతులు జోడించి మొక్కుతున్నా.. సుశాంత్ కేసులో సీబీఐ ఎంక్వైరీ జరిపించండి. సుశాంత్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలేంటో నేను తెలుసుకోవాలి. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియాల'ని అమిత్ షాను వేడుకుంది.