Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మీడియా ఓవరాక్షన్ చేస్తోంది.. వారి రాజకీయాలకు బలి అవుతున్నా: రియా చక్రవర్తి
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక అసలు కారణం ఏమిటనేది నెలలు గడుస్తున్నా ఇంకా మిస్టరీ వీడలేదు. స్టార్ సెలబ్రెటీ మరణం వెనుక ప్రస్తుతం హీరోయిన్ రియా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా నేషనల్ మీడియాలో ఆమెకు సంబంధించిన అనేక రకాల అనుమానాస్పద కథనాలు వెలువడుతున్నాయి. ఒక విధంగా తనను దోషిగా చూపించే ప్రయత్నం కూడా జరుగుతోందని రియా సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
నేషనల్ మీడియా స్పెషల్ ఫోకస్
సుశాంత్ ప్రేయసిగా ఉన్న రియాపై అనేక రకాల ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ సెలబ్రెటీస్ కూడా ఆమెపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే సుశాంత్ మరణానికి ఆమెనే కారణం అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ కేసుతో సంబంధం ఉన్నవాళ్లపై నేషనల్ మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే.
రియా.. మరో పిటిషన్
అయితే ఈ విషయంపై రియా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోర్టులో మరో పిటిషన్ వేశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి విషయంలో మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని నిజంగా అతిగా చేస్తున్నారని అందువల్ల ఇప్పుడు తాను దోషిగా అయ్యానని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఎన్నికల కారణంగా..
అదే విధంగా బీహార్ రాజకీయాల కారణంగా కూడా తాను ఒక బలి పశువుగా దోషిగా నిలబడాల్సి వస్తోందని అంటూ పాట్నాలో FIR నమోదు కావడం వల్ల ఆ రాష్ట్ర సీఎం ప్రమేయం వల్లనే కేసును హైలెట్ చేసి చూపిస్తున్నట్లు రియా తెలిపింది. ఇదంతా ఎన్నికల ఉన్నందువలన రాజకీయా ఎత్తుగడ అని ఆమె పేర్కొనడం హాట్ హాట్ టాపిక్ గా మారింది.
ఆ ఆత్మహత్యల గురించి మాట్లాడటం లేదు
నాలుగు గోడల మధ్య జరిగిన ఆత్మహత్య ఘటన ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ఆశుతోష్ భక్రే, సమీర్ శర్మ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఘటనల గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. సుశాంత్ మరణం బీహార్ ఎన్నికల సమయంలో చోటుచేసుకోవడం దురదృష్టకారం అంటూ పాట్నాలో FIR కేసుకు బీహార్ సీఎం బాధ్యత వహిస్తున్నట్లు తెలుస్తోందని రియా పేర్కొన్నారు.
Recommended Video
మీడియా దోషిగా తెల్చోస్తోంది..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఇంకా దర్యాప్తు పూర్తవ్వలేదు. కానీ ముందుగానే పిటీషనర్ ని మీడియా దోషిగా తెల్చోస్తోందని సాక్ష్యులను కూడా మీడియా విచరిస్తోందని అన్నారు. కేసు వల్ల ప్రైవసీ లేకుండా పోతోందని సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు బయట ప్రపంచానికి తెలియకుండా జరుగుతోందని రియా తన పిటిషన్ లో వివరంగా పేర్కొన్నారు.