Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
భయంతో ఖరీదైన లాయర్ని సెట్ చేసుకున్న రియా.. ముందస్తు బెయిల్ కోసం ప్లాన్!
నెలరోజుల దాటినా ఇంకా సుశాంత్ సింగ్ మృతికి గల అసలు కారణాలు తెలియరాలేదు. కానీ రోజుకో అనుమానం మాత్రం హాట్ టాపిక్ గా మారుతోంది. పోలీసుల విచారణలో ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక మొన్నటివరకు సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి కేసుతో పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ మంగళవారం సుశాంత్ సింగ్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ కేసు నమోదు చేయడంతో సరికొత్త సంచలనానికి దారి తీసింది. దీంతో రియాలో భయం కూడా ఎక్కువైనట్లు తెలుస్తోంది.
ఫైట్ చేయడానికి సిద్దమైన రియా
ఈ కేసు వివాదం నుంచి బయటపడటానికి రియా ఫైట్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రియా చక్రవర్తిపై సుశాంత్ సింగ్ తండ్రి మంగళవారం పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తన కొడుకు సూసైడ్ చేసుకోవడానికి ఆమె కూడా ఒక కారణమని పిర్యాదు చెయడంతో రియా న్యాయపరమైన విచారణను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది.
రియాలో పెరిగిన భయం..
అయితే కేసు విషయంలో ముందు జాగ్రత్తగా రియా కొన్ని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. సుశాంత్ తండ్రి FIR నమోదు చెయడంతో కేసును అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. కేవలం రియాపైనే కాకుండా ఆమె కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో రియాలో భయం కూడా ఎక్కువైనట్లు టాక్ వస్తోంది.
ఖరీదైన లాయర్ తో చర్చలు..
ఈ కేసు సీరియస్ గా మరే అవకాశం ఉందని గ్రహించిన రియా చక్రవర్తి ముందుగానే ఒక ఖరీదైన లాయర్ ని సెట్ చేసుకుంది. టాప్ క్రిమినల్ లాయర్ సతీష్ మనిషిండేను తన వైపున వాదించడానికి ఏర్పాటు చేసుకుంది. సుశాంత్ తండ్రి బీహార్ లో కేసు నమోదు చేశాడని తెలియగానే రియా ముందు జాగ్రత్తగా తన లాయర్ కి సమాచారాన్ని అందించింది.
Recommended Video
మూడుగంటల పాటు చర్చలు
మంగళవారం సాయంత్రమే సతీష్ దగ్గర పని చేస్తున్న మరో క్రిమినల్ లాయర్ ఆనంది ఫెర్నాండెజ్ రియాను కలిశారు. ఇంట్లోనే దాదాపు మూడు గంటల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ముందస్తు బెయిల్ కోసం కూడా లాయర్ తో రియా చర్చించినట్లు సమాచారం. ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని తనపై వస్తున్న ఆరోపణలు అబద్ధమని నిరూపించడానికి రియా చక్రవర్తి పూర్తిగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి కోర్టు విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి.