Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రిషి కపూర్ కష్టాల్లో ఉంటే అంబానీ కుటుంబం అలా.. నీతూ సింగ్ ఎమోషనల్ లేఖ
అలనాటి రొమాంటిక్ హీరో రిషి కపూర్ తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో అభిమానులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ ఆరాధ్య నటుడు ఇకలేరనే విషయాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకొంటూ ఆ విషాదం నుంచి బయటపడుతున్నారు. గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఏప్రిల్ 30న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి తేరుకొని రిషికపూర్ క్యాన్సర్ వ్యాధికి సహకరించిన ప్రతీ ఒక్కరికి ఆయన భార్య నీతూ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా దేశంలోనే పారిశ్రామిక దిగ్గజం అంబానీల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నీతూ సింగ్ ఏం చెప్పారంటే..
రిషి కపూర్ క్యాన్సర్ బారిన పడితే
రిషికపూర్ ప్రాణాంతక వ్యాధికి గురై కష్టాల్లో ఉన్నప్పుడు అభిమానులు, సన్నిహితులు మా వెంట నడించారు. మాకు నైతిక బలాన్ని, మానసిక స్థైర్యాన్ని అందించారు. ఊహించని విధంగా రిషి కపూర్ మమల్ని, ఈ లోకాన్ని వీడి విషాదాన్ని మిగిల్చారు. ఈ కష్టకాలంలో మాకు తోడుగా ఉన్న ప్రతీ ఒక్కరికి మా కుటుంబ తరపున నా కుమారుడు రణ్బీర్ కపూర్, రిద్ధిమా కపూర్, కపూర్ ఫ్యామిలీ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అని నీతూ సింగ్ తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు.
ముఖేష్ అంబానీలకు థ్యాంక్స్
నీతూ సింగ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెడుతూ.. క్యాన్సర్తో పోరాడుతున్న నా భర్తకు నైతిక మద్దతును ఇచ్చిన ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబానికి రుణపడి ఉంటాం. రిషికపూర్ అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతుంటే అంబానీ కుటుంబం అందించిన సహకారం మరువలేనిది. వారి సేవలు వెలకట్టలేనివి అని అన్నారు.
రెండేళ్ల కష్టకాలంలో
రిషికపూర్ క్యాన్సర్ బారిన పడిన తర్వాత గత రెండేళ్లు మా ప్రయాణం చాలా కష్టంగా సాగింది. ఆ సమయంలో కొన్ని మంచి రోజులు ఉన్నాయి.. మరికొన్ని విషాద రోజులు కూడా మాకు ఎదురయ్యాయి. ఆ సమయంలో అంబానీ ఫ్యామిలీ మాకు సపోర్ట్ ఇవ్వకపోతే మా పరిస్థితి ఊహించని విధంగా ఉండేది అని నీతూ సింగ్ తన పోస్టులో పేర్కొన్నారు.
Recommended Video
వ్యక్తిగతం హాస్పిటల్కు వచ్చి
రిషి కపూర్ హాస్పిటల్లో ఉన్న సమయంలో అంబానీ కుటుంబ సభ్యులు వ్యక్తిగతం వచ్చి పరామర్శించారు. రిషికి మానసిక స్థైర్యాన్ని ఇచ్చారు. ఆయనపై ఎనలేని ప్రేమ, ఆదరణ కురిపించారు. వారు చూపించి ఆప్యాయత వల్ల మాకు ఎనలేని ధైర్యం వచ్చింది. మాకు భయాందోళనల గురైతే మాకు ధైర్యాన్ని ఇచ్చారు. అందుకు ముఖేష్ బాయ్, నితా బాబీ, ఆకాష్, శ్లోకా, అనంత్, ఇషాలకు మా ధన్యవాదాలు అంటూ నీతా ఎమోషనల్ అయ్యారు.