Don't Miss!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అవయవ దానానికి సిద్దమైన ఆదర్శ జంట.. వీడియో వైరల్
రితేష్ దేశ్ముఖ్, జెనీలియా జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జెనీలియా భర్తగా తెలుగు ప్రేక్షకులకూ రితేష్ సుపరిచితుడే. వీరిద్దరి అన్యోన్యత గురించి తెలియాలంటే వీరిని సోషల్ మీడియాలోఫాలో అవ్వాల్సిందే. నిత్యం సరదగా, సందడిగా ఉంటూ జీవితాన్ని గడిపేస్తుంటారు. అప్పుడప్పుడు వీరు షేర్ చేసే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను కదిలిస్తాయి. అవి నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే పోస్ట్ చేసింది ఈ జంట.
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రితేష్ దేశ్ముఖ్, జెనీలియా జంట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తామిద్దరం దీని గురించి ఎప్పట్నుంచో ఆలోచిస్తున్నామని, కానీ ఇప్పటివరకు కుదరలేదు. ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా మేము మా అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మనం వేరొకరికి ఇవ్వగలిగిన గొప్ప బహుమతి వారికి జీవితాన్ని ఇవ్వడమే. కాబట్టి మీరు కూడా ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు ముందుకు రండి. అవయవదానం చేస్తామని ప్రతిజ్ఞ చేయండని అందర్నీ కోరింది ఈ జంట.
రితేష్ దేశ్ముఖ్ ఆ మధ్య అందర్నీ ఎమోషనల్ చేసేశాడు. ఆయన తండ్రి విలాస్ రావ్ జయంతి (మే 26) సందర్భంగా తండ్రి జ్ఞాపకాలతో కన్నీటి పర్యంతమయ్యాడు. హ్యాంగర్కు వేలాడదీసిన తన తండ్రి దుస్తులను చూస్తూ.. ఆ డ్రెస్ను వేసుకుంటున్నట్టుగా ఓ చేతిని మాత్రమే లోనికి పోనిచ్చాడు. అది తన తండ్రి చేతిగా భావిస్తూ.. తన తండ్రే ఓదారుస్తున్నట్టుగా తన చేతితో తనను ఓదార్చుకున్నాడు. ఇక ఈ వీడియో ఎందరినో ఎమోషనల్గా టచ్ చేసింది. తాజాగా ఈ దంపతులు తీసుకున్న నిర్ణయంపై బాలీవుడ్ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.